Temple For Mother: కన్నతల్లికి తన పిల్లలపై ఎంతో ప్రేమ అభిమానాలు ఉంటాయి తనకు ఏ కష్టం వచ్చిన తన పిల్లలు ప్రశాంతంగా సుఖంగా ఉండాలని తల్లి ఆహార్నిశలు కష్టపడుతుంది కానీ ఆ పిల్లలకు రెక్కలు వచ్చిన తర్వాత కన్నతల్లి కష్టాన్ని మరిచిపోయి స్వార్థంతో ఆలోచిస్తారు. ఇలా ఎంతోమంది పిల్లలు స్వార్థపూరిత ఆలోచనల కారణంగా తల్లిదండ్రులు రోడ్డున పడిన సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాము.
అలాగే మరికొందరు తమ తల్లిదండ్రులు తాముకు బరువు కావడంతో అనాధాశ్రమాలలో వదిలేస్తున్నటువంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి అయితే తాజాగా తమిళనాడుకు చెందినటువంటి ప్రభు అనే వ్యక్తి వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే తన పది సంవత్సరాల వయసులోనే తన తండ్రి మరణించడంతో తన తల్లి రెక్కల ముక్కలు చేసుకొని తనని పెంచి పెద్ద చేసింది.
ఇలా తన కోసం ఎంతో కష్టపడిన తన తల్లికి ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను అని ఆలోచించిన ప్రభు తాను పనిచేస్తూ రూపాయి రూపాయి పోగు చేస్తూ తన తల్లి బ్రతికుండగానే తనకోసం ఓ గుడి కట్టారు.ప్రస్తుతం మూడు అడుగుల ఎత్తులో ఉన్నటువంటి తన తల్లి పాలరాతి విగ్రహాన్ని చేయించి తన అమ్మ కళ్ళల్లో ఆనందాన్ని చూశారు. నాకోసం ఎంతో కష్టపడిన అమ్మే నాకు ప్రత్యక్ష దైవం అంటూ తన అమ్మ పట్ల ఉన్నటువంటి ప్రేమను చాటుకున్నారు.
ప్రస్తుతం విగ్రహం ఏర్పాటు చేసిన ఈయన త్వరలోనే గుడి కూడా కట్టబోతున్నారని తెలుస్తోంది. అయితే తన కొడుకు తన పట్ల చూపించిన ఆ ప్రేమకు తల్లి కన్నీటి పర్యంతరం అయింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తల్లిపై ఇతనికి ఉన్నటువంటి ప్రేమను చూసి అందరూ నిజంగా ఒక గొప్ప కొడుకు అంటూ ఈయన పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు