Chennai: అమ్మాయిలను హీరోయిన్ చేస్తానని నమ్మించి.. ఆపై?

Chennai: ఈమధ్య కాలంలో చాలామంది కేటుగాళ్లు అందమైన అమ్మాయిలను టార్గెట్ చేసి వారిని లోబరుచుకుని దారుణాలకు ఒడిగతున్నారు. అమ్మాయిల అవసరాలను ఆసరాగా చేసుకుని వాళ్ళను నమ్మించి మోసం చేస్తున్నారు. కొందరు దుర్మార్గులు మరింత దారుణంగా అమ్మాయిలను మోసం చేయడంతో పాటు అత్యాచారం చేసే ఆపై చంపేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నప్పటికీ అమ్మాయిలు మాత్రం మోసపోతూనే ఉన్నారు. కేటుగాళ్ల చేతిలో నిండా మోసపోయారు కొందరు అమ్మాయిలు.

తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన ఒక యువతికి సినిమాల్లో నటించాలనే కోరిక బలంగా ఉండేది. దాంతో అవకాశాల కోసం చాలా సార్లు ప్రయత్నించింది. కానీ, ఆమెకు ఎలాంటి అవకాశం రాలేదు. ఇదిలా ఉంటే, చెన్నైలోని టీనగర్ ప్రకాశం రోడ్డులో కొందరు వ్యక్తులు ఒక క్రియేషన్ పేరుతో కొత్త నటీనటులకు అవకాశాలు కల్పిస్తామని ప్రచారం చేశారు. ఆ ఈ విషయం కాస్త సదరు యువతి చెవిన పడడంతో వెంటనే ఆ అమ్మాయి ఆ క్రియేషన్ వ్యక్తులను సంప్రదించింది. సినిమాల్లో అవకాశం కల్పించాలని కోరింది. ఆ యువతి కోరిన విన్న ఆ వ్యక్తులు నీకు అవకాశం ఇవ్వాలంటే మేము అడిగినంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 

ఆ యువతికి ఏం చేయాలో అర్థం కాక సినిమాపై ఉన్న మక్కువతో సరే ఇస్తానని చెప్పింది. ఇందులో భాగంగానే ఆ యువతి రెండు మూడు దఫాలుగా ఆ వ్యక్తికి లక్షల్లో డబ్బును ముట్ట జెప్పింది. ఇలా ఎంతో మంది యువతులు నటనపై ఆసక్తితో వారిని నమ్మి లక్షల్లో డబ్బును చెల్లించారు. వారికి డబ్బు చెల్లించి దాదాపు మూడు నెలల గడిచింది. వారిని ఎవరూ సంప్రదించకపోగా, ఎటువంటి సినిమా అవకాశాలు రాలేదు. దీంతో ఆ అమ్మాయిలు చెన్నై టీనగర్ ప్రకాశం రోడ్డులో ఆ క్రియేషన్ నిర్వాహకుడిని సంప్రదించారు. మా వద్ద డబ్బులు తీసుకుని ఇప్పటి వరకు సినిమాల్లో ఎటువంటి అవకాశం ఇవ్వలేదంటూ అతడిని ప్రశ్నించారు. అతడు వెంటనే స్పందించి నటి నటుల కోసం మేము ఎటువంటి ప్రచారం చేయలేదని చెప్పాడు. ఇది విన్న ఆ యువతులు షాక్ గురయ్యారు. మోసపోయామని గ్రహించిన ఆ అమ్మాయిలు ఇక చేసేదేంలేక వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువతులు ఇచ్చిన ఫోన్ నెంబర్ల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -