Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రాజకీయ పర్యటనలో భాగంగా ఉత్తరాంధ్రలో జనసేన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ప్రతి మీటింగ్ లోనూ మాట్లాడినట్లుగానే ఈ సారి కూడా అదే రీతిలో తన ప్రసంగాన్ని ప్రజలకు వినిపించారు. వైయస్ఆర్ తో మొదలు కొని వైయస్ జగన్ వరకు దాదాపు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నాయకులందరిపైనా విమర్శలు గుప్పించారు. అందులోనూ ముఖ్యంగా తన సామాజిక వర్గానికి చెందిన మంత్రి అంబటి రాంబాబుపై తీవ్ర విమర్శలు చేసి కొందరి నాయకులకు షాక్ ఇచ్చారు.
పవన్ సభలో మాట్లాడుతూ మంత్రి అంబటిని ‘సంబరాల రాంబాబు’ అని హేలళనగా మాట్లాడారని, పవన్ మాటల్లో తాను ఎమ్మెల్యే కాలేకపోయిన బాధ కంటే తన సామాజిక వర్గం వారు మంత్రులుగా ఉన్నారనే బాధే ఎక్కువగా కనపడిందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు అదే రీతిలో కౌంటర్ ఇవ్వడంతో మాటల యుద్ధం మొదలవుతోందని అనిపిస్తోంది.
మంత్రి అంబటి ట్వీట్టర్ లో పవన్ ఉద్దేశిస్తూ ‘పీకే అంటే పిచ్చి కుక్క’ అని “నేను సంబరాల రాంబాబునైతే… నువ్వు కల్యాణాల పవన్ వి” అంటూ ఆయన సెటైర్ వేసి షాక్ ఇచ్చారు. అలాగే మంత్రి రోజాపై పవన్ అన్న మాటలకు కౌంటర్ ఇస్తూ ‘రోజా డైమండ్ రాణి అయితే.. నువ్వు బాబు గారి జోకర్ వి!’ అంటూ ట్వీట్ చేయడంతో మాటల వార్ నడుస్తోంది.
ఎంత సేపు వైసీపీ పార్టీ నాయకులపైనా, సీఎం జగన్ పైనా వ్యక్తిగత విమర్శలు చేయడం తప్పా తనకు రాజకీయంగా ఆవకాశం ఇవ్వమని, అవకాశం ఇస్తే ప్రజలకు ఏం చేస్తానో చెప్పకపోవడం ఏంటని ఇంకొంత మంది పవన్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. పవన్ రాజకీయం మొత్తం చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టాడని, అందువల్లే వైసీపీ నేతలపై విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.