Mounika Reddy: పెళ్లిపీటలెక్కనున్న భీమ్లా నాయక్ నటి.. మొగుడు ఎవరంటే?

Mounika Reddy: ఈ మధ్యకాలంలో సినీ సెలెబ్రిటీలకు పెళ్లి మీద ధ్యాసమల్లింది. ఈ క్రమంలోనే సెలబ్రిటీలందరూ ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతూ కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు. ఇలా ఒక్కొక్కరు పెళ్లి చేసుకోవడంతో కొంతమంది అభిమానులు తమ అభిమానం నటీనటులకు పెళ్లి కావడంతో తెగ ఫీల్ అవుతున్నారు.ఇకపోతే తాజాగా మరొక నటి కూడా పెళ్లికి సిద్ధమైందని తెలుస్తుంది.

ఎన్నో వెబ్ సిరీస్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మౌనిక రెడ్డి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుబోతుంది. ఈటీవీలో ప్రసారమైన అమ్మాయి క్యూటు అబ్బాయి నాటు వెబ్ సిరీస్ ద్వారా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న మౌనిక రెడ్డి అనంతరం షణ్ముఖ్ జస్వంత్ హీరోగా సూర్య వెబ్ సిరీస్ ద్వారా ఈమె పరిచయమయ్యారు. సూర్య వెబ్ సిరీస్ ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మౌనిక రెడ్డి అనంతరం వెండితెర అవకాశాలను కూడా అందుకున్నారు.

తాజాగా పవన్ కళ్యాణ్ రానా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో కూడా ఈమె కానిస్టేబుల్ పాత్రలో నటించి సందడి చేశారు.అలాగే విశ్వక్ సేన్ ఓరి దేవుడా సినిమాలో కూడా కీలక పాత్రలో నటించిన మౌనిక రెడ్డి తన నటనతో మంచి మార్కులు కొట్టేశారు. దీంతో ప్రస్తుతం ఈమె పలు షార్ట్ ఫిలిమ్స్ అలాగే వెండి తెర సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీ అయినటువంటి మౌనిక రెడ్డి తన వ్యక్తిగత జీవితం గురించి కూడా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలోనే ఈమె కథ కొన్ని సంవత్సరాల నుంచి సింగర్ సందీప్ అనే వ్యక్తితో ప్రేమలో ఉందని ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఈ నెల 17 18 వ తేదీల్లో వీరి వివాహం గోవాలో ఎంతో ఘనంగా జరగనున్నట్లు ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఈ క్రమంలోనే ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అసలు సందీప్ ఎవరు ఏంటి అని ఆరా తీస్తున్నారు.ఇక ఈయన సింగర్ గా మంచి గుర్తింపు పొందడమే కాకుండా బాగా ఆస్తిపరులని, సందీప్ వందల కోట్లకు వారసుడు అని తెలియడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కాబోయే ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -