Manoj-Mounika: మనోజ్, మౌనిక మొదటిసారి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు కానీ?

Manoj-Mounika:సినిమా ఇండస్ట్రీలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారిన విషయం ఏదైనా ఉందా అంటే అది మంచు మనోజ్ భూమా నాగిరెడ్డి కుమార్తె మౌనిక వివాహం అని చెప్పాలి.సినిమా ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఈ కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి వారసుడుగా వచ్చిన మనోజ్ మొదట ప్రణతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని తనకు విడాకులు ఇచ్చారు. ఈ క్రమంలోనే దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె మౌనికను పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఈ విధంగా వీరి పెళ్లి గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే తాజాగా ఈ పెళ్లి విషయంపై ఎమ్మెల్యే గోనె ప్రకాష్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ నిజం చెప్పాలంటే మంచు కుటుంబానికి భూమా కుటుంబానికి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది. ఈ అనుబంధంతోనే మనోజ్ మౌనిక మొదటిసారి వివాహం చేసుకోవాలని భావించారు. అయితే వీరి పెళ్లికి నాగిరెడ్డి ఒప్పుకోకపోవడంతో వీరిద్దరూ వేరే వారితో వివాహాలు చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారని ఈయన తెలిపారు.

ఇకపోతే భూమా మౌనిక వివాహమైన తర్వాత కొడుకు పుట్టగానే తన భర్తతో మనస్పర్ధలు రావడం చేత విడాకులు తీసుకున్నారు. అలాగే మనోజ్ సైతం తన భార్యతో విడాకులు తీసుకున్నారు.ఈ విధంగా వీరిద్దరూ వారి జీవిత భాగస్వామిల నుంచి విడాకులు తీసుకున్న అనంతరం వీరిద్దరూ ఒకటి కావాలని భావించారు. ఈ క్రమంలోనే చాలా కాలం నుంచి వీరిద్దరు చెన్నైలో సహజీవనం చేస్తున్నారంటూ ఈయన షాకింగ్ కామెంట్స్ చేశారు.

గత కొంతకాలం నుంచి వీరిద్దరూ చెన్నైలో ఉండగా తాజాగా హైదరాబాద్ వచ్చినట్టు సమాచారం. ఇక ఈ విషయం ఇటు ఇండస్ట్రీలోనూ రాజకీయాలలో అందరికీ తెలిసిన నిజం అంటూ ఈ సందర్భంగా గోనె ప్రకాష్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదే విషయంపై మంచు మనోజ్ ను ప్రశ్నించగా ఇది జీవితానికి సంబంధించిన విషయమని సరైన రోజు చూసి ఈ విషయాన్ని తెలియచేస్తానంటూ ఈయన చెప్పడంతో నిజంగానే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అర్థమైంది. అయితే తాజాగాఎమ్మెల్యే ప్రకాష్ చేసిన కామెంట్స్ అందరిని ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -