Mukesh Ambani:రిలయన్స్ ఇండస్ట్రీ ఛైర్మన్ ముకేష్ అంబానీతో పాటు ఆయన కుటుంబానికి మరోసారి బెదిరింపు కాల్ రావడంతో ఉలిక్కిపడ్డారు. అంబానీ కుటుంబాన్ని భయాందోళనకు గురిచేసి రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న హర్కిసాన్దాస్ ఆస్పత్రికి అదే నంబర్తో పలుమార్లు కాల్స్ వెళ్లడంతో కలకలం రేగింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఫోన్ నంబర్ ఆధారంగా ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అన్ని కోణాల్లో విచారించగా అదుపులోకి తీసుకున్న వ్యక్తి మానసిక స్థితి సరిగా లేనట్లు ప్రాథమిక సమాచారం. అయితే ఈ ఘటనపై పోలీసులు మాత్రం వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. గతేడాది ముకేష్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్న స్కార్పియోను నిలిపి ఉంచడం కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఈ కారు ఘటన జరిగిన వారం రోజుల్లోనే స్కార్పియో యజమాని మాన్సుఖ్ హీరేన్ అనుమనాస్పదంగా మృతి చెందాడు. అయితే ఈ కేసులో మొదట ఇన్స్పెక్టర్ సచిన్ వాజే దర్యాప్తు చేపట్టగా ఆ తర్వాత ఆయనే ప్రధాన నిందితుడు గవడం ఒక్కసారిగా షాక్కు గురి చేసింది.