Sam: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ కపుల్స్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సమంత నాగచైతన్య జంట ఒకటి వీరిద్దరు సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతూ ప్రేమించుకుని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి వివాహ బంధం కొద్ది రోజుల పాటు కూడా బలంగా లేదని చెప్పాలి. వీరిద్దరి మధ్య వచ్చినటువంటి మనస్పర్ధలు కారణంగా వీరి వివాహ బంధానికి ముగింపు పలికారు.
ఈ విధంగా నాగచైతన్య సమంత విడాకులు తీసుకుని దాదాపు మూడు సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ విరి విరాకుల గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.ఇకపోతే విడాకుల తర్వాత కూడా అక్కినేని ఫ్యామిలీలో కొంతమంది కుటుంబ సభ్యులతో సమంత చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ముఖ్యంగా సమంత అఖిల్ తో ఇప్పటికీ చాలా సన్నిహితంగా ఉండటమే కాకుండా ఆయన సినిమాలు విడుదల సమయంలోను పుట్టినరోజు సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు.
అఖిల్ తో పాటు నాగచైతన్య మదర్ లక్ష్మీ గారితో కూడా ఈమె చాలా సన్నిహితంగా ఉంటారట ఇప్పటికీ పలు సందర్భాలలో నాగచైతన్య తల్లి లక్ష్మీని సమంత కలుస్తూ ఉంటారని తెలుస్తోంది. అయితే ఒకానొక సమయంలో నాగచైతన్య తల్లిని కలిసినటువంటి సమంతా నాగచైతన్య గురించి మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారని తెలుస్తోంది. నాగచైతన్య తనని చాలా ప్రేమించే వారిని కానీ అమల కారణంగా ఆయన నాపై అపార్థాలు చేసుకున్నారు అంటూ లక్ష్మీ దగ్గర బాధపడ్డారని తెలుస్తోంది.
అమల గురించి సమంత మాట్లాడుతూ …అమలా ప్రతి విషయంలోనూ తనకు కండిషన్స్ పెట్టే వారిని ఒకానొక సమయంలో తాను ఇంట్లో కాకుండా జైలులో ఉన్నాను అనే భావన తనలో కలిగేదని ఈమె లక్ష్మీ దగ్గర చెబుతూ బాధపడ్డారట. ఆ ఇంట్లో ఉండటం వల్ల నా స్వేచ్ఛను మొత్తం వారి చేతుల్లోకి తీసుకున్నారని ఆమె ప్రభావం నాగచైతన్య పై కూడా చాలా ఉండడంతో ఆయన కూడా తనని అపార్థం చేసుకున్నారు అంటూ ఈమె అమల గురించి చెబుతూ బాధపడ్డారని తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.