Chaitanya-Samantha: అభిమానుల కోసం రాజీ పడిన చైతన్య సమంత.. వీళ్లిద్దరూ కలవబోయేది అప్పుడేనా?

Chaitanya-Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ సెలెబ్రిటీ జంట విడిపోయిన అది కొన్ని రోజుల వరకు మాత్రమే చర్చగా ఉంటుంది. కానీ నాగచైతన్య, సమంత విడిపోయి రెండు సంవత్సరాలైన వీరి అభిమానులు మాత్రం వీరి విడాకుల విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వీరిద్దరు మళ్ళీ కలిస్తే బాగుండు అని కలలు కంటున్నారు. కానీ ఇద్దరు ఎవరి దారి వారిది అన్నట్లుగా తమ కెరీర్ పరంగా బాగా బిజీగా ఉన్నారు.

అయితే గత కొన్ని రోజుల నుండి వీరిద్దరూ మళ్లీ ఒకటవుతున్నారని జోరుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అదేంటంటే సమంత నాగచైతన్యతో విడిపోయిన వెంటనే తాము కలిసి దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో డిలీట్ చేసింది. అయితే కొన్ని రోజుల కిందట తమ పెళ్లి ఫోటోలతో పాటు వారిద్దరూ కలిసి దిగిన కొన్ని ఫోటోలు సమంత ఇంస్టాగ్రామ్ ఖాతాలో కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా వారిద్దరు కలవబోతున్నారని.. ఇదే పెద్ద హింట్ అని తెగ సంతోషపడ్డారు.

అయితే రీసెంట్ గా నాగచైతన్య షేర్ చేసిన పోస్టుల బట్టి కూడా వీరిద్దరూ త్వరలోనే కలవబోతున్నారు అని తమ అభిమానులు తెగ ప్రచారం చేస్తున్నారు. ఇంతకు అసలు విషయం ఏంటంటే.. సమంత పెట్ డాగ్ హష్ నాగచైతన్య దగ్గర ఉండటంతో వీరిద్దరూ కలవడం ఖాయమని అనుమానాలు వస్తున్నాయి. నిజానికి ఆ పెట్ ను సమంత తెచ్చుకోగా నాగచైతన్య కూడా దానిపై ప్రేమ చూపించాడు. ఇక వారిద్దరూ విడిపోయాక సమంత తన పెట్ ను తన వెంటే తీసుకెళ్లింది. అయితే ఇప్పుడు ఆ పెట్ నాగచైతన్య దగ్గర ఉంది.

అయితే తాజాగా సన్ సెట్ సమయంలో హష్ తో దిగిన ఒక ఫోటోను నాగచైతన్య సోషల్ మీడియాలో పంచుకోగా ఆ ఫోటోకు వైబ్ అనే క్యాప్షన్ ఇచ్చాడు. ఇక ఆ ఫోటో చూసి అభిమానులు ఒకింత సంతోషపడుతున్నారు. చైతన్యను పూర్తిగా దూరం పెట్టేసిన సమంత.. ఇప్పుడు తన పెంపుడు కుక్కపిల్లను చైతన్య దగ్గరికి పంపించిందంటే.. సమంతకు చైతన్య పై మళ్లీ ప్రేమ పుట్టుకొచ్చిందేమో అని.. దీనిని బట్టి చూస్తే వీరిద్దరూ త్వరలో ఒకటవుతున్నారేమో అని ఆశలు పెంచుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ బ్యాలెట్ నంబర్ ఖరారు.. ఓటర్లు సులువుగానే ఓటు వేయొచ్చుగా!

Pawan Kalyan:  జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పేరు బ్యాలెట్ ఆర్డర్లో ఎక్కడ ఉందో జనసేన పార్టీ ఒక...
- Advertisement -
- Advertisement -