Samantha: నాగచైతన్య పరువు గంగలో కలిపిన సమంత.. ఏమన్నారంటే?

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది యశోద సినిమాతో పలకరించిన సామ్ ఇప్పుడు శాకుంతలం సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సమంత ప్రమోషన్స్ లో భాగంగా బిజీబిజీగా గడుపుతోంది. వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడిస్తోంది. ఇకపోతే సామ్ నటించిన శాకుంతలం సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేయబోతున్నారు.

ఏప్రిల్ 14న శాకుంతలం సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతుంది. కాగా తాజాగా బాలీవుడ్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత విడాకుల తర్వాత పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. ఆ సమయంలో నా మనసుకు నచ్చినట్టు నేను రియాక్ట్ అయ్యాను. ఇండిపెండెంట్ ఉమెన్ గా నన్ను అందరూ అంటున్నారు. కానీ నేను అలా అనుకోవడం లేదు. నేను చాలా కన్నీళ్లు, కష్టాలు, బాధలు చూశాను. నాకు మంచే జరుగుతుందా అని రోజు మా అమ్మని అడిగేదాన్ని. అలాంటి పరిస్థితుల్లో నేను చీకటి రోజులు చూశాను. అప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేవి.

 

కానీ నా ఫ్యామిలీ, కొంతమంది స్నేహితులు నాకు సపోర్ట్ గా నిలిచారు. గతంతో పోలిస్తే చీకటి రోజులు కొంతవరకు తగ్గాయనే అనుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కున్నాక మనలో ఇంకా ధైర్యం పెరుగుతోంది అని తెలిపింది. సమంత ఇంటర్వ్యూలో భాగంగా చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ మాటలను నాగచైతన్య ఉద్దేశించి సమంత చేసిందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -