NagaChaitanya: అక్కినేని అభిమానుల కోరికను చైతన్య తీరుస్తారా?

NagaChaitanya: అక్కినేని వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన నాగ చైతన్య టాలీవుడ్ గుడ్‌బాయ్‌గా పేరు తెచ్చుకున్నాడు. సాధ్యమైనంతవరకు రూమర్స్, కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాడు. కేవలం సినిమాలు, ప్రమోషన్స్, కెరీర్ అంటూ తన పని తాను చేసుకుంటాడు. అయితే ఇటీవల నాగచైతన్య నటించిన సినిమాలు వరుసగా నిరాశను మిగిల్చాయి. దాంతో సినిమా స్టోరీ ఎంపిక విషయంలో ఆచితూచీ అడుగులేస్తున్నారు. తాజాగా విక్టరీ వెంకటేశ్ కూతురు అశ్రితతో కలిసి చైతన్య ఓ వీడియోలో పాల్గొన్నాడు. సినిమాల విషయం పక్కన పెడితే.. చైతన్యకు హైదరాబాద్‌లో ‘షోయు’ అనే జపనీస్ రెస్టారెంట్ ఉంది. అథెంటిక్ జపనీస్ ఫుడ్ కాకుండా అక్కడి మెనూని ఇక్కడి లోకల్ మసాలాతో యాడ్ చేసి సర్వ్ చేస్తుంటారు.

 

తాజాగా ఈ రెస్టారెంట్‌కి హీరో వెంకటేశ్ పెద్ద కూతురు అశ్రిత వెళ్లింది. అశ్రిత ‘ఇన్ఫినిటీ ప్లాటర్’ అనే యూట్యూబ్ ఛానెల్‌ను రన్ చేస్తుంది. రెస్టారెంట్లలో ఫుడ్‌ను ఎక్స్‌ పోర్ల్ చేస్తుంటుంది. అలా నాగచైతన్య రన్ చేస్తున్న ‘షోయు’ రెస్టారెంట్‌కు వెళ్లి వ్లాగ్ చేసింది. ఈ వీడియో పూర్తిగా ఇంగ్లీష్‌లోనే కొనసాగుతుంది. ఈ వీడియోలో షోయులో లభించే ఫ్యూజన్ జపనీస్ ఫుడ్ గురించి చైతూ వివరించాడు. అశ్రిత.. మా బావను మీట్ అవుదామంటూ.. వీడియో స్టార్ట్ చేస్తుంది. షోయు అంటే మీనింగ్ ఏంటని చైతుని అడగగా.. సోయా సాస్ అని సమాధానం చెప్తాడు.

 

అయితే ఈ రెస్టారెంట్ పెట్టడానికి కారణమేంటని అశ్రిత అడగగా.. ‘నాకు జపనీస్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్లినా జపనీస్ ఫుడ్ కోసం సెర్చ్ చేస్తాను. అందుకే ఇక్కడ కూడా జపనీస్ రెస్టారెంట్ ఉండాలని అనుకున్నాను. అందుకే రెస్టారెంట్ స్టార్ట్ చేశాను.’ అని చైతూ సమాధానం చెప్పాడు. అలా వీరి మధ్య ఎంతో క్యూట్‌గా కన్వర్జేషన్ జరుగుతుంది. అయితే నాగచైతన్య సమంతతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. నెట్టింట ఈ వీడియో వైరల్ అవ్వడంతో వీరిద్దరినీ చూసిన నెటిజన్లు పెళ్లి చేసుకుని ఒక్కటైతే బాగుంటుందని భావిస్తున్నారు. చైతన్య అనవసరంగా సమంతను పెళ్లి చేసుకున్నాడని, అశ్రితను చేసుకుంటే కలిసి హ్యాపీగా ఉండేవాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చైతన్య-అశ్రిత పెళ్లి చేసుకుంటే.. దగ్గుపాటి, అక్కినేని ఫ్యామిలీ మధ్య ఉన్న చిన్న గ్యాప్ కూడా ఫిల్ అవుతుందంటున్నారు. దీనికి అక్కినేని అభిమానులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అయితే అభిమానుల కోరికను అక్కినేని, దగ్గుపాటి ఫ్యామిలీ ఎలా రెస్పాండ్ అవుతుందో వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -