AP Liquor Scam: ఏపీ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు గతంలో ఏపీ ముఖ్యమంత్రిగా పని చేస్తున్నటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం కూటమిలో భాగంగా ఈయన రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎంపీ బరిలోకి దిగబోతున్నారు. ఈ క్రమంలోనే గత రెండు రోజులుగా ఈయన ఇక్కడే పర్యటిస్తూ ఉన్నారు.
ఈ క్రమంలోనే మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భాగంగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను సైతం పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.
ప్రస్తుత వీరిద్దరిని తీహార్ జైల్లో పెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ..ఆంధ్రాలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ తో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కాం బలాదూర్ అంటూ ఈయన చేసిన వ్యాఖ్యల సంచలనంగా మారాయి. ఇక వైసిపి సీనియర్ నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్ల కూడా ఈయన విమర్శలు కురిపించారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిన్నచిన్న కాంట్రాక్టులు చేస్తూ కాంట్రాక్టర్ గా ఉండేవారు. అనంతరం ఈయన రాజకీయాలలోకి రావడమే కాకుండా తన కుమారుడు మిథున్ రెడ్డి కూడా డబ్బు సంపాదన కోసమే రాజకీయాలలోకి వచ్చి రాజకీయాలను వాడుకుంటున్నారని తెలిపారు. ఈ పది సంవత్సరాల కాలంలో వీరిద్దరూ ప్రజల సొమ్మును ప్రభుత్వ సొమ్మును లూటీ చేయడం తప్ప వీరు చేసింది ఏమీ లేదు అంటూ కిరణ్ కుమార్ రెడ్డి రామచంద్రారెడ్డి పట్ల చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.