Mahesh: మహేశ్ ఫోటో చూసి తట్టుకోలేక నమ్రత అలాంటి పనులు చేసిందా.. ఏం జరిగిందంటే?

Mahesh: మహేష్ బాబు ఎప్పటికప్పుడు తన మేకోవర్ తో, సరికొత్త లుక్స్ తో తన అభిమానులని ఎప్పటికప్పుడు ఆశ్చర్యం లో ముంచెత్తుతూ ఉంటాడు. అయితే ఇప్పుడు అతని కొత్త లుక్ అభిమానులనే కాదు ప్రతి సినీ ప్రేమికుడు షాక్ అయ్యేంత రాకింగ్ లుక్ లో ఉంది. ఇందులో మహేష్ బాబు స్టైలిష్ లుక్ ఎంత బాగుందంటే, అతని భార్య నమ్రత సైతం ఫిదా అయిపోయింది. అయితే ఈ ఫోటోలని నమ్రత శిరోద్కర్ షేర్ చేయడంతో అవి మరింత వైరల్ అయ్యాయి.

ఇవి మహేష్ బాబు నటించిన కొత్త ఆడ్ షూట్లో తీసినవి. మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఎక్కువగా విదేశాలకి టూర్లకి వెళ్తూ కుదిరినప్పుడు మధ్య మధ్యలో గుంటూరు కారానికి డేట్లిస్తూ ఉండటంతో ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. అయితే అభిమానులు మాత్రం ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా, ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు చేయబోయే సినిమా కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఇలాంటి సమయంలో ఒక కొత్త యాడ్ షూట్ లో మహేష్ పాల్గొన్నారు. ఈ యాడ్ షూట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు నమ్రత శిరోద్కర్ షేర్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. మహేష్ కొత్త హెయిర్ స్టైల్ తో అదిరిపోయే లుక్స్ తో సూపర్ గా ఉన్నాడు. ఇక ఈ కొత్త హెయిర్ స్టైల్ ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ చేశారు. ఈ ఫోటోలో అలీమ్ కూడా మహేష్ పక్కనే ఉన్నారు.

ఈ ఫోటో చూసిన అభిమానులు హాలీవుడ్ హీరోలా ఉన్నావు అంటూ, మహేష్ కొత్త లుక్ అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేశారు. ఈ లుక్ తో ఒక యాక్షన్ సినిమా పడితే రికార్డులు బ్రేక్ అవుతాయి అంటూ నేటిజన్స్ కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. కొసమెరుపు ఏమిటంటే ఈ హాట్ లుక్స్ కి భార్య నమ్రత శిరోద్కర్ కూడా ఫిదా అయిపోయి ఫైర్ ఎమోజీలు ట్యాగ్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Aalim Hakim (@aalimhakim)

Related Articles

ట్రేండింగ్

Budi Mutyala Naidu: వైసీపీ ఎంపీ అభ్యర్థికి “సన్” స్ట్రోక్.. తండ్రి ఓటమి కోసం కొడుకు ప్రచారం చేస్తున్నారా?

Budi Mutyala Naidu:  రాష్ట్ర ఎన్నికలలో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయాల ముందు కుటుంబ బంధాలు ఓడిపోతున్నాయి. ఇంతకుముందు టెక్కలి లో ఇలాంటి ఘటన ఒకటి చూసాము, ఇప్పుడు అనకాపల్లి పార్లమెంటు...
- Advertisement -
- Advertisement -