Nandamuri Balakrishna: సినీ కెరియర్ లోనే మొదటిసారి అలాంటి యాడ్ కు బాలయ్య గ్రీన్ సిగ్నల్?

Nandamuri Balakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బాలకృష్ణ ఇన్ని రోజులపాటు కేవలం వెండితెరపై మాత్రమే సందడి చేశారు. ఈయన ఇండస్ట్రీలో అగ్ర హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికీ అందరి హీరోలు మాదిరిగా ఎలాంటి యాడ్ చేయడానికి ఇష్టపడడం లేదు. సాధారణంగా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు వచ్చిన తర్వాత ఆ హీరోలు కమర్షియల్ యాడ్స్ ద్వారా పెద్ద ఎత్తున డబ్బు సంపాదిస్తూ ఉంటారు. కానీ బాలయ్య మాత్రం ఎప్పుడూ కూడా ఇలాంటి యాడ్ చేయడానికి ఇష్టపడలేదు.

ఈ క్రమంలోనే ఈయన కేవలం వెండితెరపై సినిమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తూ వచ్చారు. ఇలా వెండితెర సినిమాలలో బిజీగా ఉన్నటువంటి బాలకృష్ణ ఆ తర్వాత ఆహాలో ప్రసారమయ్యే అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇలా బాలకృష్ణ వ్యాఖ్యాతగా కూడా ఎంతో ఆదరాభిమానాలు సొంతం చేసుకున్నారు. ఇక ఈ కార్యక్రమం ప్రస్తుతం రెండవ సీజన్ ఎంతో విజయవంతంగా పూర్తి అవుతుంది.

ఇకపోతే మొదటిసారి బాలకృష్ణ కమర్షియల్ యాడ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.వెండితెర నుంచి ఓటీటీలో సందడి చేసిన బాలయ్య ఇకపై కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈయన మొదటిసారిగా శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో సాయి ప్రియ కన్స్ట్రక్షన్స్ గ్రూప్ కోసం తెరకెక్కించే ఒక యాడ్ లో బాలయ్య సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని శ్రేయాస్ మీడియా అధికారకంగా తెలియజేశారు.

ఈ విధంగా బాలకృష్ణ తన కెరీర్ లోనే మొదటిసారి యాడ్ రంగంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో శ్రేయాస్ మీడియా బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలా తమ అభిమాన హీరో అన్ని రంగాలలో సత్తా చాటడంతో అభిమానులు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -