Nandigam Suresh: పవన్ పై నందిగం సురేష్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Nandigam Suresh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్రలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ వారాహి యాత్రలో భాగంగా ఈయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ ఆయనకు తన స్టైల్ లో కౌంటర్ ఇవ్వడమే కాకుండా పవన్ కళ్యాణ్ ఊగిపోతూ మాట్లాడుతున్నారు అంటూ కామెంట్ చేశారు ఈ క్రమంలోనే అప్పటినుంచి పవన్ కళ్యాణ్ హావాభావాలపై చర్చలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలోనే బాపట్ల ఎంపీ నందిగం సురేష్ పవన్ కళ్యాణ్ పై తన స్టైల్ లో సెటైర్స్ వేశారు. సాధారణంగా తాగిన వారు మాత్రమే అలా ఊగుతూ, వాగుతూ మాట్లాడుతారు. కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు అలా మాట్లాడాలని ప్రశ్నించారు.పవన్ కళ్యాణ్ ధోరణి ఎలా ఉంది అంటే నేను ఎవరినైనా తిట్టొచ్చు కానీ నన్ను ఎవరు తిట్టకూడదు అనే ధోరణిలో ఈయన మాట్లాడుతున్నారని తెలిపారు.

 

పవన్ కళ్యాణ్ ఊగుతూ ప్రత్యర్థులను తిడుతున్నారని ఈయన చంద్రబాబు నాయుడు బానిసత్వంలో ఎలాంటి విరామం లేకుండా పని చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు సూచనల మేరకే పవన్ కళ్యాణ్ గాజువాక భీమవరంలో పోటీ చేశారు అయితే ఆ రెండు చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోయేలా చేశారని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ తాను ఒక సత్య హరిశ్చంద్రుడు అని భావించి మాట్లాడుతున్నారని ఈయన విమర్శించారు.

 

2014లో కలిసి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి 2019లో ఎందుకు విభేదాలు వచ్చాయో తెలియదని తెలిపారు. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం విభిన్న ప్రయత్నాలు చేస్తున్నారని ఎవరు ఎన్ని చేసినా వచ్చే ఎన్నికలలో గెలుపు మాత్రం వైఎస్ఆర్సిపిదేనని,జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు అంటూ ఈ సందర్భంగా నందిగం సురేష్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -