Nara Brahmani: రిమాండ్ రిపోర్ట్ ను దేవాన్ష్ చదివినా ఆధారాలు ఎక్కడ అని అడుగుతారు.. బ్రాహ్మణి సంచలన వ్యాఖ్యలు!

Nara Brahmani: చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో తెలుగు రాష్ట్రాలలో తెలుగు నేతలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేస్తున్నారు. అయితే తాజాగా రాజమండ్రిలో చంద్రబాబు నాయుడు సతీమణి, కోడలు నారా బ్రాహ్మణి, భువనేశ్వరి కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. ఈ క్రమంలోని మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి నారా బ్రాహ్మిని అధికార ప్రభుత్వం పై విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు రాత్రి పగలు అని తేడా లేకుండా ఎంతో కష్టపడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు ఎన్నో సంక్షేమ పథకాలను అందించారు.

నేను ఒక కుటుంబ సభ్యురాలిగా కాకుండా ఆయన పాలనలో బెనిఫిషియరుగా మాట్లాడుతున్నాను ఎంతోమంది యువతకు ఆయన ఇంజనీరింగ్ సీట్లలో రిజర్వేషన్ కల్పించి మంచి భవిష్యత్తుఅందించారు. ఇలాంటి ఒక నాయకుడిని ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేశారు. అయితే న్యాయవ్యవస్థ పై మాకు నమ్మకముందు ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ఆధారాలు చూపించి చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేశారు.

ఇలా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు చాలా అన్యాయం అని న్యాయవ్యవస్థ పై మాకు నమ్మకం ఉంది కనుక ఆయన నిర్దోషి అని బయటకు వస్తారు అంటున్నారా బ్రాహ్మిని తెలియజేశారు. అదేవిధంగా లోకేష్ పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారి బస్సు యాత్ర ఎంతో విజయవంతమవుతున్నాయి. ఇలా ఈ యాత్రలకు వస్తున్నటువంటి ఆదరణ చూసి తడబడినటువంటి ప్రభుత్వం తప్పుడు ఆరోపణలతో అరెస్టు చేశారని తెలిపారు.

చంద్రబాబు నాయుడు గారి రిమాండ్ రిపోర్ట్ నా ఎనిమిది సంవత్సరాల కుమారుడు దేవాన్ష్ చదివిన ఆధారాలు ఎక్కడ అంటూ ప్రశ్నిస్తారు. అలా ఎక్కడ ఒక ఆధారం లేకుండా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్టు చేశారని ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని ఆయన కోసం ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు ఒక కుటుంబంకా తరలి వచ్చారు అంటూ బ్రాహ్మిని చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -