Naresh: నరేష్ పెద్ద తిరుగుబోతు.. నా కాళ్ళు కూడా పట్టుకున్నాడు

Naresh: సీనియర్ నటుడు నరేష్ వ్యవహారశైలి ఎప్పుడు వివాదస్పదమే. మొన్నటిదాకా మా అసోసియేషన్ లో తోటి నటులతో గొడవలు పెట్టుకుంటూ వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు తన పర్సనల్ మేటర్స్ తో వివాదాల్లో కొనసాగుతున్నాడు. ఇప్పటికే ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ తాజాగా సీనియర్ నటి పవిత్ర లోకేష్ తో నాలుగో పెళ్ళికి రెడీ అయ్యాడు.

 

న్యూ ఇయర్ సందర్బముగా పవిత్ర లోకేష్ తో లిప్ లాక్ పెడ్తూ.. ఇద్దరం త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము అంటూ ఓ వీడియో రిలీజ్ చేసాడు. దింతో నరేష్ మూడో భార్య రమ్య రఘపతి మీడియా ముందుకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేసింది. మా ఇద్దరికీ విడాకులు ఇంకా రాలేదు అని.. ఆ అంశం కోర్ట్ పరిధిలోనే ఉంది అని స్పష్టం చేసింది. తమ కొడుకు మేము కలిసి ఉండాలని కోరుకుంటున్నాడు.. అందుకే నరేష్ కి విడాకులు ఇవ్వను అని తెలిపింది. అంతే కాకుండా పవిత్రతో నరేష్ పెళ్లి కూడా జరుగనివ్వను అని చెప్పింది.

 

గతంలో నరేష్ ఎన్నో సార్లు అమ్మాయిలతో దొరికిపోయి తన కాళ్ళ మీద పది ఏడ్చి సారీ కూడా చెప్పేవాడు అని వెల్లడించింది. ఇప్పుడు పవిత్ర లోకేష్ లిప్ లాక్ వీడియో చూసి తన కొడుకును వాడి ఫ్రెండ్స్ ఏడిపిస్తున్నారు అని వాపోయింది. నరేష్ తప్పులను కప్పిపుంచుకునేందుకు తన మీద అక్రమ సంబంధాలు అంటూ నానా నిందలు వేస్తున్నాడని కన్నీరు పెట్టుకుంది. ఇన్ని నిందలు వేస్తున్నా చావకుండా కేవలం తన కొడుకు కోసమే భరిస్తున్నా అంది.

 

సమ్మోహనం సినిమా సమయంలో పవిత్ర ఒకసారి తమ ఇంటికి రాగా భోజనం కూడా వడ్డించానని చెప్పింది. అయితే మా ఎలక్షన్స్ సమయంలో వారిద్దరి మీద తనకు అనుమానం వచ్చింది అని తెలిపింది. తన బాధ చుసిన విజయనిర్మల.. ఆస్తిలో వాటా ఇవ్వను అని నరేష్ కు వార్నింగ్ కూడా ఇచ్చిందంది. ఎప్పుడు అయితే విజయనిర్మల చనిపోయిందో నరేష్ ఆగడాలకు హద్దు లేకుండా పోయిందని చెప్పుకొచ్చింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -