Naresh-Ramya: విడాకులు కోసం రమ్యకు నరేష్ బంపర్ ఆఫర్

Naresh-Ramya: సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ లవ్ స్టోరీ గురించి ఏ వార్త వచ్చిన జనాలకు మంచి టైం పాస్. గత కొంత కాలంగా మీడియా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన నరేష్ పెళ్లిళ్ల గురించే చర్చ. ఇప్పటికే మూడు పెళ్లిళ్ళు చేసుకున్న నరేష్ పవిత్రతో నాలుగో పెళ్ళికి రెడీ అయిన సంగతి తెలిసిందే. తాజాగా నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి షాకింగ్ కామెంట్స్ చేసింది. సూపర్ స్టార్ కృష్ణతో తనకు అక్రమ సంబంధం అంటగట్టాడు అని సంచలన ఆరోపణలు చేసింది. రమ్య ఆరోపణలు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి.

 

తనకు విడాకులు కావాలని నరేష్ చాలా సార్లు అడిగాడని.. విడాకులు ఇస్తే మూడు కోట్ల రూపాయల నుంచి ఇరవై కోట్ల రూపాయల వరకు ఆఫర్ చేశాడని తెలిపింది. అయితే డబ్బు తనకు ముఖ్యం కాదని అందుకే విడాకులు ఇవ్వను అని నరేష్ కు చెప్పాను అంది. నరేష్ కు విడాకులు ఇవ్వకుండా ఇంకో పెళ్లి చెస్కోలేడని స్పష్టం చేసింది.

 

చిలికి చిలికి గాలి వానలా మారుతున్నా వీరి వ్యవహారంపై ఇండస్ట్రీ పెద్దలు పలు సూచనలు కూడా చేసినట్టు తెలుస్తోంది. ఈ వివాదాన్ని పెద్దది చేయడం వల్ల ఇరు కుటుంబాల పరువు పోతుందని.. అందుకే సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

 

గతంలో పవిత్ర, నరేష్ బెంగుళూరులోని ఓహోటల్ రూంలో ఉంటె.. రమ్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. వీరిపై పోలీస్ ఫిర్యాదు కూడా చేసింది. ఈ వీడియోలు మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. ఇటీవల న్యూ ఇయర్ సందర్బాముగా పవిత్రతో నరేష్ లిప్ లాక్ పెడ్తూ వీడియో కూడా రిలీజ్ చేసాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దింతో మీడియా ముందుకు వచ్చిన రమ్య.. నరేష్ క్యారెక్టర్ గురించి సంచలన ఆరోపణలు చేసింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -