Naresh: సీనియర్ నరేష్ కు ఇంతకు మించిన ఘోర అవమానం లేదుగా!

Naresh: సీనియర్ నటుడు నరేష్ విజయనిర్మల కుమారుడు అన్న విషయం మనకు తెలిసిందే. అయితే కృష్ణ విజయనిర్మల బ్రతికున్నప్పుడు నరేష్ కృష్ణ విజయనిర్మల మధ్య ఉంటూ వారికి చేదోడువాదోడుగా ఉండేవారు అయితే అప్పుడు నరేష్ వ్యవహారం గురించి మహేష్ బాబు ఫ్యామిలీ కూడా ఎవరు ఏమి మాట్లాడలేదు.కానీ విజయనిర్మల కృష్ణ ఇద్దరు చనిపోవడంతో నరేష్ తో మాకు ఏమీ సంబంధం లేదు. అసలు నరేష్ ఎవరు అన్న ప్రశ్నలు కృష్ణ వేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

మే 31వ తేదీ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన నటించిన మోసగాళ్లకు మోసగాడు సినిమా విడుదలవుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాని కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు స్వయంగా నిర్మించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా తిరిగి విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాని ప్రమోట్ చేస్తూ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ… ఓ సందర్భంలో నరేష్ ఎవరు మాకేం సంబంధం లేదు అంటూ మాట్లాడారు.

 

ఇలా ఆదిశేషగిరిరావు మాట్లాడటానికి కూడా కారణం ఉంది. నరేష్ విజయనిర్మల కృష్ణ గారు ఉన్నప్పుడు వారు చెప్పిన విధంగానే వినేవారు. అయితే ఇప్పుడు వారు చనిపోవడంతో నరేష్ ఆగడాలకు అద్దు అదుపు లేకుండా పోయింది. ఈ వయసులో కూడా ఆయన మరొక నటితో రిలేషన్ లో ఉండడమే కాకుండా ఇద్దరు పబ్లిక్ గా రొమాన్స్ చేస్తూ లిప్ లాక్ పెట్టుకోవడం వంటివి మహేష్ బాబు కుటుంబ సభ్యులకు కాస్త ఇబ్బందిగా మారాయని తెలుస్తోంది.

 

నరేష్ పవిత్ర వ్యవహారం ఇలా ఉండడంతో ఈ విషయాలన్నింటినీ మహేష్ బాబు ఫ్యామిలీ రిసీవ్ చేసుకోలేకపోతుందని అందుకే నరేష్ ఎవరు మాకేం సంబంధం లేదు అంటూ ఆదిశేషగిరిరావు మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే కృష్ణ గారు బ్రతికే ఉంటే కనుక ఆదిశేషగిరిరావు నోటి వెంట ఇలాంటి మాట వచ్చేదా అని మరికొందరు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.కృష్ణ సంపాదించిన ఆస్తిలో నరేష్ వాటా అడగలేదు విషయ నిర్మల ఆస్తిలో కూడా మహేష్ బాబు కుటుంబ సభ్యులు వాటా అడగలేదు ఇలా ఆస్తుల గురించి పంచాయతీ లేకపోయినప్పటికీ కృష్ణ మాత్రం తన కొడుకులంతా కాకపోయినా నరేష్ ని కూడా కొడుకుగానే భావించారు. అయితే కృష్ణ చనిపోయిన తర్వాత నరేష్ తో మాకు ఏమి సంబంధం లేదని ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు మాట్లాడటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -