Nayanatara: పిల్లలు పుడతారని తెలిసి నయన్ పెళ్లి చేసుకుందా.. షాకింగ్ విషయాలు రివీల్!

Nayanatara: దక్షిణాది సిని ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి నయనతార ఏమాత్రం అవకాశాలను కోల్పోకుండా ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకొని హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇకపోతే ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి నయనతార ఇదివరకే పలువురు హీరోలు దర్శకులతో రిలేషన్ కొనసాగించారు.

గత ఏడు సంవత్సరాల నుంచి నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమలో ఉన్నారు. ఈ ఏడాది ఈ జంట జూన్ 9వ తేదీ ఎంతో ఘనంగా మహాబలిపురంలో పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఇలా వివాహమైన తర్వాత వీరిద్దరూ తరచూ విదేశీ పర్యటనలకు వెళ్తూ వీరి వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.ఇలా వీరి వైవాహిక జీవితం గురించి ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకొని విగ్నేష్ తాజాగా ఒక పోస్ట్ చేశారు.

ఈ క్రమంలోనే వీరిద్దరూ ఇద్దరు పిల్లల పాదాలను ముద్దాడుతున్న ఫోటోని షేర్ చేస్తూ వాళ్లు ఇద్దరు మగ పిల్లలకు జన్మనిచ్చామని, తల్లిదండ్రులు అయ్యామంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ విధంగా ఈ జంట తల్లిదండ్రులు కావడంతో చాలామంది వీరు సరోగసి ద్వారా తల్లిదండ్రులు అయ్యారని భావిస్తున్నారు. ఇకపోతే ఈ విషయంపై మరికొందరు పలు రకాలుగా విమర్శలు చేస్తూ వారి అభిప్రాయాలను కూడా తెలియజేస్తున్నారు.

పెళ్లి జరిగిన నాలుగు నెలలకే వీరిద్దరూ తల్లిదండ్రులు అయ్యారు అంటే పెళ్లికి ముందే ఈ జంట సరోగసి పద్ధతి ద్వారా పిల్లలను కనాలని ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే పెళ్లికి ముందే ఇలా పిల్లలను ప్లాన్ చేసుకున్న ఈ జంట పిల్లలు పుడతారని తెలిసే పెళ్లి చేసుకున్నారని పలువురు భావిస్తున్నారు.ఇలా పిల్లలను కనుక ప్లాన్ చేసుకోకపోయి ఉంటే నయనతార దంపతులు ఇప్పుడే పెళ్లి చేసుకునే వారు కాదని వీరి వివాహం మరింత ఆలస్యం అయ్యేదని కోలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏది ఏమైనా నయనతార పెళ్లి అయిన వెంటనే ఇలా తల్లి కావడం అభిమానులను ఆనందానికి గురిచేస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -