Nayanthara-Vignesh Shivan: వివాదం నడుస్తున్న సరోగసిపై నయన్ దంపతుల పోస్ట్.. వైరల్

Nayanthara-Vignesh Shivan: సినీ పరిశ్రమ, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో ఉండేవారికి వివాదాలు కామన్ అయిపోయాయి. ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా నిమిషాల్లో ప్రపంచమంతా తెలిసిపోతుంది. అయితే లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార వివాదాల్లో చిక్కుకుంది. అయితే ఇది ఎక్కడ మొదలయింది అంటే వాళ్ళు సరోగసి పద్దతిలో సంతానంను పొందడమే.

అయితే ఎంతో కాలంగా ప్రేమించుకుంటున్న నయన్ మరియు విగ్నేష్ శివన్  లు ఈ సంవత్సరం జూన్ 9న మహాబలిపురంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఈ పెళ్ళికి ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరై ఈ జంటని ఆశీర్వదించారు. అయితే ఇదే సంవత్సరం అక్టోబర్ 9న వాళ్ళు చేసిన ఒక పోస్ట్ వివాదాస్పదం అయింది. ఎందుకంటే వాళ్ళు చేసిన పోస్ట్ ఇద్దరు పిల్లల పాదాలను ముద్దాడుతూ మేము తల్లిదండ్రులం అయ్యామని తెలిపారు.

అయితే వీరికి వివాహం జరిగి కేవలం నాలుగు నెలలే కావడంతో వీరు సరోగసి పద్దతి ద్వారా పిల్లల్ని అయ్యారని వీరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజం చెప్పాలంటే సరోగసి పద్దతిలో పిల్లలకి జన్మనివ్వడం మన భారత దేశంలో నిశేధం. ఈ చట్టం ఈ సంవత్సరం జనవరి నుండి అమలులోకి వచ్చింది. ఇక వీరి తీరుపై అసహనం వ్యక్తం చేసిన కోర్ట్ నోటీసులు ఇచ్చింది.

అయితే నోటీసులు ఇచ్చినా వీళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేదు. కోర్టు కి హాజరై వివరాణ ఇవ్వడం లేదు. అయితే ఈ విషయంపై విగ్నేష్ శివన్  తన ఇంస్తాగ్రామ్ లో పోస్ట్ లు పెట్టాడు. అన్ని విషయాలు సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తాయి. ఓపిక పట్టండి అని ఈ ఇష్యూ గురించి స్పందించడం జరిగింది. అయితే సరోగసి పద్దతిలో తల్లిదండులైన ఈ దంపతులకు నేరుగా స్పందించడం ఇష్టపడడం లేదని తెలుస్తోంది. మరి కోర్ట్ కి వివరణ ఎప్పుడు ఇచ్చుకుంటారో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: ఉప్మాకు అమ్ముడుపోవద్దంటూ పవన్ కళ్యాణ్ సెటైర్లు.. ఆ ఉప్మా ఎవరంటే?

Pawan Kalyan:  ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పవన్ కళ్యాణ్ తన ప్రచారం లో జోరు, ప్రసంగాలలో హోరు పెంచుతున్నారు. తనదైన స్టైల్ లో ప్రతిపక్షం వారిని విమర్శిస్తూ కూటమి అధికారంలోకి వస్తే...
- Advertisement -
- Advertisement -