Anasuya: వామ్మో.. అనసూయను అస్సలు వదలని విజయ్ ఫ్యాన్స్!

Anasuya: తెలుగు రాష్ట్రాల ప్రజలకు యాంకర్ అనసూయ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దాదాపు నాలుగు పదుల వచ్చినప్పటికీ.. అనసూయకు ఇప్పటికీ చెక్కుచెదరని అందం తన సొంతం. తన అద్భుతమైన యాంకరింగ్ తో ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తనకంటూ కొంత వరకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది.

ఎందుకంటే.. ఒట్టి యాంకరింగ్ తోనే కాకుండా తన అందం తో కూడా కుర్రకారుని మెస్మరైజ్ చేస్తుంది ఈ అమ్మడు. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలు సోషల్ మీడియా ఇన్ స్టా ఖాతాలో పంచుకుంటుంది. ప్రస్తుతం అనసూయ వెండి తెరపై అడుగుపెట్టి వరుస ఆఫర్లను తన సొంతం చేసుకుంటుంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో అనసూయ ప్రేక్షకులను ఒక రేంజ్ లో అక్కట్టుకుంది.

ఇక అనసూయ కెరీర్ పరంగా ఒక రేంజ్ లో దూసుకుపోతుందని చెప్పవచ్చు. కానీ ఈ అమ్మడు గత కొన్ని రోజులుగా నెటిజన్ల నోట్లో నానుతుంది. ఇటీవల లైగర్ సినిమా విడుదలయినప్పుడు.. సినిమా బాగోలేదు అని టాక్ వచ్చింది. దీంతో అనసూయ సోషల్ మీడియా ద్వారా కొన్ని వ్యాఖ్యలు చేసింది. అమ్మను అన్న ఉసురు ఊరికే పోదు అని.. సోషల్ మీడియాలో ఒక ట్వీట్ ద్వారా తెలియజేసింది.

ఇది గమనించిన విజయ్ దేవరకొండ అభిమానులు.. ఇంకెక్కడ ఆగుతారు. అనసూయను ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఆంటీ ఆంటీ అంటూ తెగ ఆట పట్టిస్తున్నారు.ఈ క్రమంలో అనసూయ ఎటువంటి ఫోటో పంచుకున్నా.. ఆ ఫోటో గురించి అనేక రకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. తనను ఆంటీ ఆంటీ అంటున్న వారి మీద కేసు పెడతాను అని అనసూయ తెలియజేసింది.

అయినప్పటికీ దేవరకొండ ఫ్యాన్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా అనసూయ తన ఫ్యామిలీతో కలిసి విజయవాడకు వెళుతున్న సమయంలో.. దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ ఫోటోలు చూసిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయను ఒక రేంజ్ లో ఏకీపారేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -