Samantha: టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత తాజాగా శాకుంతలం మూవీ ప్రమోషన్స్లో పాల్గొంది. ఈ సందర్భంగా కన్నీళ్లు పెట్టుకోవడంతో సమంత అభిమానులు తీవ్రంగా కలత చెందుతున్నారు. సమంత ఇటీవల మయోసైటిస్ అనే అరుదైన జబ్బుతో బాధపడుతున్నానని తెలిపిన విషయం తెలిసిందే. తర్వాత తాను చికిత్స తీసుకుంటున్నానని తెలిపింది. మరోవైపు సమంతకు సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు చాలా మంది అండగా నిలిచారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తాజాగా సమంతను చూసిన అభిమానులు చాలా నీరసించిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలోనూ సమంత యాక్టివిటీ తగ్గించింది. అంతకుముందు కాస్త యాక్టివ్గానే ఉండేది సమంత. తాజాగా శాకుంతలం మూవీ ప్రమోషన్స్ సందర్భంగా కాస్త ఎమోషనల్ అయ్యింది సమంత. మళ్లీ చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చినట్లయింది.
సినిమాలపై అంకిత భావం కలిగిన సమంత.. తాను ఆరోగ్య కారణాలతో ఇబ్బందులు పడుతున్నా సినిమాలను వదల్లేదు. ఇబ్బంది పడుతూ కూడా సినిమాల్లో ఉత్సాహంగా నటించింది. యశోద మూవీ సందర్భంగా కూడా ఇదే జరిగిందని చిత్ర యూనిట్ తెలిపింది. యశోద సినిమా తర్వాత సమంతను మళ్లీ మీడియా సమావేశంలో చూసిన ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ కామెంట్పై సమంత అదిరిపోయే రిప్లయ్ ఇచ్చింది.
సమంతను చూస్తే జాలిగా ఉందంటూ ఆ నెటిజన్ కామెంట్ చేశాడు. ఆమె అందం బాగా తగ్గిపోయిందని వ్యాఖ్యానించాడు. విడాకుల తర్వాత ఆమె కెరీర్లో ఉన్నత స్థానంలో ఉంటుందని భావించామని, మయోసైటిస్ జబ్బు ఆమెను బాగా దెబ్బతీసిందని కామెంట్ చేశాడు. సామ్ను మళ్లీ బలహీనురాలిగా చేసిందని కామెంట్ చేయడంతో సమంత రిప్లై ఇచ్చింది. తనలాగా కొన్ని నెలల పాటు చికిత్స తీసుకొనే పరిస్థితి మీకు రాకూడదని గట్టిగా కోరుకుంటున్నానని పేర్కొంది సమంత. మీ అందం.. మరింత పెరిగేలా తన ప్రేమను కూడా కొంచెం పంపుతున్నాననంటూ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది.