Nikhil: కార్తికేయ2 విడుదల వాయిదాకు.. దిల్ రాజుకు సంబంధం లేదు: నిఖిల్

Nikhil: చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కార్తికేయ 2 ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ చివరికి ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమా తరచు వాయిదా పడడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో నిఖిల్ ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ కొందరు ఉద్దేశపూర్వకంగానే తన సినిమా విడుదల థియేటర్లు దొరక్కుండా చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నిఖిల్ మాట్లాడుతూ ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు, ఏషియన్ సునీల్ గారు నా ప్రొడ్యూసర్స్…నేను ఈ సినిమా గురించి వాళ్లతో మాట్లాడినప్పుడు ఎందుకు క్లాష్ రావడం సినిమాని వాయిదా వేసుకోవడం మంచిది కదా అంటూ చెప్పారు వాళ్ళు ఇలా అనేసరికి మరి నా సినిమా ఎప్పుడు విడుదల కావాలి అని ఆరోజు చాలా బాధపడ్డానని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.ఇలా నిఖిల్ చేసిన ఈ మాటల వెనుక దిల్ రాజు గారు ఏషియన్ సునీల్ తనకు థియేటర్ లు దొరక్కుండా సినిమాని వాయిదా వేస్తున్నారని స్పష్టంగా చెప్పారు.

ఇక ఈ సినిమా ఎట్టకేలకు ఆగస్టు 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాలను అందుకోవడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దిల్ రాజు ముఖ్యఅతిథిగా రావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.ఈ కార్యక్రమంలో భాగంగా దిల్ రాజు మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసి అసలు విషయం తెలియకుండా మీ ఇష్టం వచ్చింది రాసేస్తారా అంటూ మండిపడ్డారు.

ఈ విధంగా ఈ సినిమా హిట్ అవ్వడమే కాకుండా దిల్ రాజు మీడియాపై మండిపడటంతో అనంతరం నిఖిల్ మాట్లాడుతూ తన సినిమా విడుదల అవ్వడానికి దిల్ రాజుకు ఏ విధమైనటువంటి సంబంధం లేదని వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఒకేసారి ఇద్దరి హీరోల సినిమాలు విడుదలవుతే ఎవరికీ కలెక్షన్స్ రావన్న ఉద్దేశంతోనే సినిమా వాయిదా వేయమని చెప్పారు. అందుకే తన సినిమా ఇలా వాయిదా పడుతూ వస్తే ఎప్పుడు విడుదల అవుతుందని బాధపడ్డాను తప్ప తాను ఎక్కడ ఎవరి పేరు ప్రస్తావనకు తీసుకురాలేదని ఈయన ఒకేసారి మాట మార్చారు. ఇలా నిఖిల్ మాట మార్చడంతో పలువురు నెటిజన్లు నిఖిల్ ఎంతైనా హీరో కదా చాలా బాగా నటిస్తున్నారని నిఖిల్ పై కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -