Tarakaratna :నందమూరి తారక రామారావు మనవడు నందమూరి తారకరత్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తారకరత్న ఇండస్ట్రీలో హీరోగా రాణించలేకపోయాడు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందాడు. తాత వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజకీయాలలోకి ప్రవేశించాలని తారకరత్న భావించాడు.
ఈ క్రమంలో వచ్చే ఎన్నికలలో టిడిపి తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు జనవరి 27వ తేదీ నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్ర ప్రారంభించిన మొదటి రోజే భారతరత్న గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. దీంతో వెంటన అతన్ని బెంగుళూరుకి తరలించి చికిత్స అందించారు. అయితే దాదాపు 23 రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన తారకరత్న ఫిబ్రవరి 18వ తేదీ తుది శ్వాస విడిచాడు. ఆయన మరణంతో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
ముఖ్యంగా తారకరత్న మరణం ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. తారకరత్న కుటుంబ సభ్యులను ఎదిరించి అలేఖ్యని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు వారిని దూరం పెట్టారు. తారకరత్న మరణం తర్వాత వారి జీవితంలో ఎదురైన కష్టాలను తలుచుకొని అలేక్య చాలా ఎమోషనల్ అయ్యింది. పెళ్లి తర్వాత అయిన వారే తమని దూరం పెట్టి నరకం చూపించారని, జీవితమంతా కష్టాలే ఉన్నాయని ఇటీవల ఎమోషనల్ అయ్యింది.
ఇక తాజాగా తారకరత్న తన కూతురితో గడిపిన చివరి రోజుకి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో తారక రత్న తన పెద్ద కుమార్తె నిషికతో కలిసి వీడియో గేమ్ ఆడాడు. హిందూపురం వెళ్లడానికి ముందు రోజు కూతురితో కలసి గేమ్ ఆడిన చివరి వీడియో అంటూ చాలా ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.