Indore: భర్తను కాదని.. బరితెగించిన భార్య.. చివరికి?

Indore: ఇటీవల కాలంలో చాలామంది పెళ్లయిన వావాహితలు భర్తను కాదని ఇతర పురుషులతో వివాహేతర సంబంధం పెట్టుకుంటున్నారు. కొందరు వివాహితలు భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఘటనలు కూడా ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ మద్య కాలంలో ఎక్కడ చూసినా కూడా ఇలాంటి ఘటనలే ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. కొందరు మహిళలు భర్తలను మోసం చేస్తూ భర్తల కళ్ళు కప్పి ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా అలాంటి దారుణమే ఒకటి చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ ఇండోర్ లోని ఒక ప్రాంతంలో జావేద్ అనే వ్యక్తికి గతంలో ఒక మహిళతో వివాహం జరిగింది.

పెళ్లైన చాలా కాలం పాటు ఈ దంపతులు సంతోషంగా ఆనందంగా ఉన్నారు. వారి దాంపత్య జీవితం కూడా సాఫీగానే సాగుతూ వచ్చింది. అయితే ఈ క్రమంలోనే అతని భార్య భర్త ఉండగానే షకీర్ అనే యువకుడితో ప్రేమాయణాన్ని కొనసాగించింది. ఇక సమయం దొరికినప్పుడల్లా ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ వచ్చింది. అలా కొన్ని రోజులు గడిచింది. కానీ, ప్రియుడితో గడిపేందుకు భర్త అడ్డుగా ఉన్నాడని భావించి భర్తను చంపాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్నితన ప్రియుడు షకీర్ కు వివరించింది. ప్రియురాలి మాటకు ప్రియుడు కూడా ఓకే చెప్పాడు. అనుకున్నదే ఆలస్యం ఇటీవల ఒక రోజు షకీర్ తన ప్రియురాలి ఇంటికి వచ్చాడు.

 

వస్తూనే ప్రియురాలి భర్తతో గొడవకు దిగాడు. భార్య మాత్రం భర్తకు కాకుండా ప్రియుడికి మద్దతు పలికింది. ఈ క్రమంలోనే ప్రియుడితో కలిసి భార్య రెచ్చిపోయింది. అందరూ చూస్తుండగానే జావేద్ ను ఇద్దరూ కలిసి అతి దారుణంగా హత్య చేశారు. అది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుడి భార్యతో పాటు ఆమె ప్రియుడు షకీర్ ను అరెస్ట్ చేశారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -