Samantha: మళ్లీ విషమించిన సమంత ఆరోగ్యం.. కేవలం వాటితో మాత్రమే ఆమె బ్రతుకుతోందా?

Samantha: సౌత్ ఇండియన్ సెన్సేషనల్ హీరోయిన్ అయిన సమంత కొంతకాలం గా మైయోసైటిస్ అనే ఆటో ఇమ్యునో వ్యాధితో బాధపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. విడాకులు అయిన తర్వాత నుంచి తనకి ఈ జబ్బు వచ్చింది. దీనికోసం తను ఎన్నో ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి విదేశాలకు సైతం పరుగులు తీస్తుంది. ఈ సమస్య విషమం అవడంతో కొన్ని నెలలు ఇండస్ట్రీ నుంచి బ్రేక్ తీసుకుంది సమంత.

మళ్ళీ ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది కూడా సాదాసీదా టాక్ తో ముగియడంతో ప్రస్తుతం సమంత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో ఎవరికీ తెలీదు. ముందున్నంత ఆక్టివ్ గా కూడా సోషల్ మీడియాలో ఈ మధ్య ఉండడం లేదు సమంత. అప్పట్లో వారానికి రెండు మూడు పోస్టులైనా పెట్టే సమంత ఇప్పుడు నెలకి రెండు మూడు పోస్టులు పెట్టే స్థితికి వచ్చింది.తన జబ్బు తన ఒంటిమీద పడుతున్నట్టు క్షుణ్ణంగా కనిపిస్తుంది.

తన రూపురేఖలన్నీ మారిపోయి ఒళ్ళు క్షేనించే స్థితికి వచ్చేసింది. ఈమధ్య కోలుకుంటున్నాను అంటూ చెప్పింది సమంత. అలాగే కొంతకాలం ముందు ఇంటర్వ్యూలలో కూడా ఈ నొప్పి భరించలేక కెమెరా ముందే ఏడ్చేసిన సంఘటనలు చాలానే జరిగాయి. ఈ సమస్య నుంచి కోలుకుంటుంది అనుకున్న సమంత నిన్నే తన ఇంస్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెట్టింది.సెలైన్ ఎక్కించుకుంటూ దీని వల్ల ఎనర్జీ బూస్టింగ్ పెరిగి జరిగే ఉపయోగాలు ఏంటో ఇంస్టాగ్రామ్ ద్వారా పేర్కొంది.

తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుందని, ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షన్ మెరుగవుతుందని, కండరాల శక్తివంతంగా అవుతాయని, ఎముకలు బలాన్ని పెంచుకోవచ్చని, గుండెకు సంబంధించిన వ్యవస్థ సక్రమంగా పని చేస్తుందని, వైరస్ లతో పోరాడుతుందని సామ్ రాసుకొచ్చింది. ఇంట్రావీనస్ న్యూట్రిషన్ అనేది ప్రధానంగా పోషకాహార లోపాలను పరిష్కరించడానికి ఇవ్వబడుతుందని, కొన్ని వైద్య పరిస్థితులకు రోగ లక్షణ ఉపశమనాన్ని అందిస్తుందని సమంత పేర్కొంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -