Renu Desai: పవన్ రేణు దేశాయ్ కు భారీ షాకిచ్చాడా.. ఏం జరిగిందంటే?

Renu Desai: రేణు దేశాయ్ పరిచయం అవసరం లేని పేరు నటిగా పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా అందరికీ ఈమె ఎంతో సుపరిచితమే.ఇలా పవన్ కళ్యాణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన అనంతరం పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ఇద్దరు కూడా విడాకులు తీసుకుని విడిపోయారు. ఇలా వీరి విడాకులకు సరైన కారణాలు తెలియకపోయినా ఈమె తన పిల్లలతో కలిసి ఒంటరిగా జీవిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం మరో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారు.

ఇక రేణు దేశాయ్ తన భర్త పవన్ కళ్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడే ఈమె తిరిగి సినిమాలలోకి ఎంట్రీ ఇస్తున్నారు.ఇలా సినిమాలు చేస్తూ ప్రస్తుతం బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.అయితే తాజాగా రేణు దేశాయ్ చేసిన ఒక పోస్ట్ కనుక చూస్తే కచ్చితంగా పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చే లాగే ఉందని తెలుస్తోంది.

 

ఈ సందర్భంగా రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మండుటెండలో చల్లని మేఘాలల కొందరు మన జీవితంలోకి అనుకోకుండా వస్తారు. వారు మన జీవితంలో ఉన్నది కొంతసేపే ఆయన జీవితాంతం వారి ప్రభావం మనపై ఉండేలా చేస్తారు. వారు చూసే చూపులు మాట్లాడే మాటలు మన మనసును ఎక్కడో తాకుతాయి. వారితో కలిసి కొంతకాలం ప్రయాణం చేసిన ఆ ప్రయాణం గుర్తొచ్చిన ప్రతిసారి బాదేస్తోంది. కొందరైతే మీ కన్నీళ్లు తుడిచి మిమ్మల్ని నవ్విస్తూ మీ జీవితాన్ని పరిపూర్ణం చేస్తారు అంటూ పోస్ట్ చేశారు.

 

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇది చూసినటువంటి పలువురు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన జీవితంలోకి అనుకోకుండా వచ్చి అనుకోకుండా వెళ్లిపోయారు.ఈ విషయాన్ని ఉద్దేశిస్తూ ఈమె ఈ పోస్ట్ చేశారని తెలుస్తోంది. అయితే చివర్లో కన్నీళ్లు తుడిచి నవ్విస్తూ మీ జీవితాన్ని పరిపూర్ణం చేస్తారు అని చెప్పడంతో ఈమె జీవితంలోకి ఎవరో వచ్చారని చెప్పకనే చెబుతూ పవన్ కళ్యాణ్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారనీ తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -