Pawan kalyan: విమర్శలు చేసిన వాళ్లు నోళ్లు మూయించనున్న పవన్.. ఏమైందంటే?

Pawan kalyan: సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేవలం హీరోగా మాత్రమే కాకుండా రాజకీయ నాయకుడుగా కూడా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి పది సంవత్సరాలు అయింది. అయితే గత ఎన్నికలలో భాగంగా ఈయన గాజువాక నుంచి పోటీ చేసి ఘోర పరాజయం పాలైన విషయం మనకు తెలిసిందే.

ఇలా కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఏమవుతారు అంటూ అధికారపక్ష నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు.అయితే వచ్చే ఎన్నికలలో మాత్రం పవన్ కళ్యాణ్ తన సత్తా ఏంటో చూపించడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే 2024 ఎన్నికలలో భాగంగా తన విజయమే ధ్యేయంగా ఈయన ముందుకు వెళుతున్నారు.పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో కూడా గాజువాక భీమవరం రెండు చోట్ల పోటీ చేయడానికి సిద్ధమయ్యారు.

 

ఇలా ఎక్కడైతే గత ఎన్నికలలో తాను ఓడిపోయి విమర్శలు పాలయ్యారో అక్కడే తన గెలుపును అందరికీ పరిచయం చేయబోతున్నారని తనని విమర్శించిన వాళ్ళ నోర్లు తన గెలుపుతో మూయించాలనీ పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. అందుకే వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గాజువాక భీమవరం ప్రాంతంలో గెలిచి అందరికీ తన పవర్ ఏంటో తెలియజేయాలని పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.

 

ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోని ఈ ఏడాది చివరి వరకు ఈయన తన సినిమా షూటింగ్ పూర్తి చేసి అనంతరం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలని ఫిక్స్ అయ్యారట. అందుకే ఈయన తన సినిమా షూటింగ్ పనులలో బిజీగా గడుపుతున్నారు. ఇలా షూటింగ్ పనులు పూర్తికాగానే వారాహి యాత్ర ద్వారా ప్రచార పనులు ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -