Pawan Kalyan: టాలీవుడ్ మెగా ప్రిన్సెస్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిల పెళ్ళికి మరొక నాలుగు రోజుల మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. ఇక మెగా ఫ్యామిలీకి సంబంధించి ఒక్కొక్కరు ఇటలీకి చేరుకుంటున్నారు. ఇటలీలోని టుస్కనీ నగరంలో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠీల వివాహం డెస్టినేషన్ వెడ్డింగ్ గా జరగబోతుంది. ఆల్రెడీ పెళ్లి కోసం షాపింగ్ చేస్తోన్న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిలు ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక నాగబాబు ఆయన భార్య పద్మజ ఇప్పటికే ఇటలీకి చేరుకున్నారు. లావణ్య ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఇటలీకి వెళ్లిపోయారు. మెగా ఫ్యామిలోని మెగాస్టార్ చిరు-సురేఖ, చరణ్ ఉపాసన, అల్లు అర్జున్, స్నేహ ఇలా మెగా జంటలు ఇంకా అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ చిరు కూతుళ్లు ఇలా అందరూ ఒక్కరిగా ఇటలీ చేరుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ ఆయన భార్య అన్నా లెజెనోవాతో కలిసి ఇటలీకి పయనం అయ్యారు. ఎయిర్ పోర్ట్ లో పవన్ కళ్యాణ్-అన్నా లెజెనోవా కలిసి వెళుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవన్ భార్య అన్నా లెజినోవా మీడియాకి కనిపించడం, పబ్లిక్ లో తిరగడం కూడా చాలా తక్కువ.
చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి లెజినోవా కనిపించడంతో కెమెరా మ్యాన్స్ తమ కెమెరాలకు పని చెప్పారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్-అన్నా లెజెనోవాల వీడియోస్, ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పెళ్లికి ముందు జరిగే మెహేంది నుంచి పెళ్లి అలాగే సంగీత ఫంక్షన్ వరకు ప్రతి ఒక్కటి అక్కడే జరగనున్నాయి. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిన వివాహం నవంబర్ 1న జరగనున్న విషయం తెలిసిందే.