Pawan Kalyan: పవన్ కూతురు ఆద్య చేసిన పనికి దండం పెట్టాల్సిందే!

Pawan Kalyan: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వాళ్లే లేరు. ఎన్నో మంచి సినిమాలలో నటించి స్టార్ హీరోగా నిలిచాడు పవన్. తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నాడు. ఇక ప్రస్తుతం ఓవైపు సినిమాలనే కాకుండా మరోవైపు తన పార్టీ తరఫున భాగ ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే.. తనతో కలిసి నటించిన రేణు దేశాయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

కానీ కొంతకాలానికే వీరిద్దరూ విడిపోయారు. వీరికి అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు కూడా ఉండగా ఆ పిల్లల బాధ్యతలు మొత్తం రేణు దేశాయ్ చూసుకుంటుంది. ఇక గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారింది రేణు దేశాయ్. ఆ మధ్య బుల్లితెరపై ఢీ డ్రామా జూనియర్స్ లో జడ్జిగా కొంతకాలం చేసింది. ఆ తర్వాత బుల్లితెరకు కూడా దూరంగా ఉండగా కేవలం సోషల్ మీడియా ద్వారా మాత్రమే అందరికీ టచ్ లో ఉంటుంది.

 

ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులు రేణు దేశాయ్ కు మంచి గౌరవం ఇస్తూ ఉంటారు. పవన్ కూడా తన పిల్లల బాధ్యతలను అసలు వదలలేదు. ఇక వీరిద్దరూ తమ పిల్లల కోసం అమ్మానాన్నలుగా మాత్రం ఉన్నారని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ అభిమానులు అకీరా, ఆద్యలని చూసి బాగా మురిసిపోతుంటారు. వారు ఏ మంచి పని చేసిన ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు.

 

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు ప్రతిసారి తన పిల్లలకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటుంది. సమయం దొరికితే తన పిల్లలతో కలిసి ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అయితే ఇదంతా పక్కన పెడితే రేణు దేశాయ్ ఆ మధ్య ఒక వీడియో పంచుకోగా.. అందులో తన కూతురు ఆద్య గంగా నదిలో దూకినట్లు కనిపించింది. ఆ తర్వాత ఆద్య నీళ్లలో ఉండి వణికి పోతున్నట్లు కనిపించింది. ఇక అందులో తను అలా వణికి పోతుండటాన్ని చూసి పవన్ అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. తను నీళ్లలో మునిగినందుకు ఏకంగా దండాలే పెడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -