Sri Reddy: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ నటి శ్రీ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. శ్రీ రెడ్డి వివాదాస్పద నటిగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. తరచూ ఏదో ఒక వివాదంతో ఎవరో ఒకరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఎక్కువగా కాంట్రవర్సీలు క్రియేట్ చేసే విధంగా కామెంట్స్ చేస్తూ ఉంటుంది. ఎదుటి వ్యక్తిని టార్గెట్ చేస్తూ వారిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటుంది. మొన్నటి వరకు సోషల్ మీడియాకు దూరంగా గడిపిన శ్రీరెడ్డి ఈ మధ్యకాలంలో మళ్లీ ఫామ్ లోకి వచ్చి రెచ్చిపోతోంది.
ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కొందరిని పదే పదే టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తూ వారి అభిమానులను బాగా రెచ్చగొడుతోంది. ఎక్కువగా మెగా ఫ్యామిలీని, దగ్గుబాటి ఫ్యామిలీని టార్గెట్ చేయడంలో ఎప్పుడూ ముందు ఉండే శ్రీ రెడ్డి తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేసింది. పవన్ పై కామెంట్లు చేయడంలో శ్రీ రెడ్డి ఎప్పుడూ ఒంటి కాలితో లేస్తూ వస్తోంది. పవన్ పై కామెంట్లు చేయాలంటే శ్రీ రెడ్డి ఎప్పుడూ ముందుగానే ఉంటుంది. ముఖ్యంగా పవన్ మూడు పెళ్లిళ్లపై ఎప్పుడూ కామెంట్లు చేసే శ్రీ రెడ్డి తాజాగా మరోసారి పవన్ను టార్గెట్గా చేసుకుని రెచ్చిపోయింది. పవన్ అటు సినిమా, ఇటు రాజకీయాలు రెండిట్లోనూ బిజీబిజీగా గడుపుతూ బ్యాలెన్స్ చేసే విషయంలో బాగా మదన పడుతున్నాడు.
తన కోసం ఇంతమంది ఫ్యాన్స్ వచ్చారని సంతోషపడాలో లేదా వీళ్లు రేపు తనకు ఓట్లు వెయ్యరు అని బాధపడాలో పవన్ కళ్యాణ్కు అర్థం కావట్లేదు పాపం అంటూ కామెంట్ చేసింది. పవన్ కళ్యాణ్ కష్టం పగోడికి కూడా రాకూడదు అంటూ సెటైర్లు వేసింది శ్రీ రెడ్డి..