Pawan Kalyan: పార్టీ నిర్వహణ అవసరాల కోసం 10 కోట్ల రూపాయలు ప్రకటించిన పవన్.. గ్రేట్ కదా!

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీ అవసరాల కోసం పెద్ద ఎత్తున తన సొంత డబ్బును ఖర్చు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. సాధారణంగా ఎవరైనా అధికారంలోకి వస్తే పేదలకు సహాయం చేస్తానని చెప్తారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తాను అధికారంలోకి లేకపోయిన తన సొంత డబ్బు అలాగే పార్టీ కోసం విరాళాలను సేకరించి ఆత్మహత్య చేసుకున్నటువంటి కౌలు రైతులకు డబ్బును ఇచ్చారు. ఇలా కష్టంలో ఉన్న వారందరికీ కూడా ఈయన విరాళంగా డబ్బును పంపించారు.

ఇక ఎన్నికల సమయంలో ఒక పార్టీని ముందుకు నడిపించాలి అంటే పెద్ద ఎత్తున డబ్బు అవసరం అనే సంగతి తెలిసిందే. డబ్బులు ఖర్చు చేస్తేనే ఎన్నికల సమయంలో వర్క్ అవుట్ అవుతుందని ఇప్పటికే ఎంతోమంది నాయకులకు కొన్ని వందల కోట్ల డబ్బులను ఎన్నికల ఖర్చుల కోసం ఉపయోగిస్తున్నారు కానీ జనసేన పార్టీకి ఆ స్థాయిలో స్తోమత లేదు.

పార్టీని ముందుకు నడిపించాలి అంటే విరాళాలు సేకరించాలి. అయితే తాజాగా ఎన్నికల సమీపిస్తున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ పార్టీ అవసరాల కోసం ఏకంగా 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఎన్నికల సమయంలో సభలు సమావేశాలు నిర్వహించాలి అంటే పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది అందుకే పార్టీ అవసరాల కోసమే పవన్ కళ్యాణ్ విరాళం అందజేశారు. ఈ విరాళాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో పార్టీ కోశాధికారి ఎం వి రత్నంకు విరాళం అందజేశారు. ఇలా పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులలో 10 కోట్ల రూపాయలను విరాళంగా ఇవ్వడం అంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -