Pawan Kalyan Fans: ఆర్జీవి ట్వీట్ పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. మా హీరో కనిపించట్లేదా అంటూ?

తెలుగు ప్రేక్షకులకు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. మాఫియా, హారర్ నేపథ్యంలో కలిగిన చిత్రాలను తీయడంలో దిట్ట. ఒకప్పుడు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక రామ్ గోపాల్ వర్మ కు మంచి గుర్తింపు సంపాదించి పెట్టిన సినిమాల్లో శివ, క్షణం క్షణం, రంగీలా సత్య.

ఈ సినిమాలు వర్మకి డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించి పెట్టాయి. ఒకప్పుడు క్లాసిక్ లవ్ స్టోరీ లతో తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పించిన వర్మ. ప్రస్తుతం డైరెక్టర్ పరంగా పూర్తిగా దిగజారి పోయాడు. మొత్తానికి బూతు ప్రపంచానికి వర్మ అంకితం అయ్యాడని చెప్పవచ్చు. ప్రస్తుతం వర్మ తీసే సినిమాలు ఎంత ఘోరంగా ఉంటున్నాయో మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

చివరకు వర్మ తీసే సినిమాలు ఆడియన్స్ కి చాలా అనీజీగా అనిపిస్తున్నాయి. ఇటువంటి సినిమాలు తీస్తూ.. ఎటు నుంచి కూడా గుర్తింపు లేకుండా వర్మ రోజురోజుకీ దిగజారి పోతున్నాడు. అంతేకాకుండా పలు వివాదాస్పద డైరెక్టర్ గా కూడా నెటిజన్ల నోట్లో నానుతున్నాడు. నిత్యం ఏదో ఒక సెలబ్రేటీతో తనకు అనిపించిన విధంగా వివాదం పెట్టుకుంటున్నాడు.

మరి ఇదే క్రమంలో వర్మ తాజాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని మండిపడేలా చేశాడు. ఇంతకీ అదేమిటంటే.. నిన్న అనగా సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే అని తెలిసినా కూడా పవన్ కు విష్ చేయలేదు. పవన్ కళ్యాణ్ బర్త్డే అని తెలిసినా కూడా వర్మ విష్ చేయలేదు అని అభిమానులు నిరాశపడ్డారు. కానీ సోషల్ మీడియాలో కన్నడ హీరో సుదీప్ గురించి ఒక ట్వీట్ చేసాడు. తనకు బర్త్ డే విషెష్ చెప్పాడు.

ఈ విషయం గమనించిన పవన్ కళ్యాణ్ అభిమానులు వర్మపై మరింత మండిపడుతున్నారు. ఇక ప్రస్తుతం వర్మ రాబోయే సినిమాల విషయానికొస్తే.. రెడ్డి గారు పోయారు. ఈ సినిమా నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతే కాకుండా శ్రీదేవి, పెళ్లి సినిమాలను ఆర్జీవి ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -