Pawan Kalyan-NTR: పవన్, ఎన్టీఆర్ నటించి ఉంటే చరిత్ర సృష్టించేది!

Pawan Kalyan-NTR: సాధారణంగా కొన్ని సినిమాలు కొందరి హీరోలకు మాత్రమే పర్ఫెక్ట్ గా సరిపోతాయని కొన్నిసార్లు అనిపిస్తుంది.ఫలానా సినిమాలో ఈ హీరో కాకుండా అతను నటించి ఉంటే సినిమా మరో లెవల్ కి వెళ్ళేది అనే సినిమాలు చాలానే ఉన్నాయి. తాజాగా ఇలాంటి సినిమా గురించి ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఆయన పుట్టినరోజు కావడంతో కళ్యాణ్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన నిర్మాణంలో వచ్చిన గాడ్సే సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ సత్యదేవ్ హీరోగా నటించిన గాడ్సే సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాము అయితే ఈ సినిమాని ఓటీటీ ఆదరించిన విధంగా థియేటర్లో ప్రేక్షకులు ఆదరించలేకపోయారు ఆ విషయంలో తాను చాలా బాధపడ్డానని తెలిపారు.అయితే ఈ సినిమా థియేటర్లో మెప్పించకపోవడానికి కారణం ఈ సినిమాకు సరైన ఆర్టిస్ట్ పడలేదనేది తన అభిప్రాయం అని నిర్మాత తెలియజేశారు.

 

గాడ్సే వంటి ప్రాజెక్టు మోయగలిగే సత్తా ఉన్నటువంటి తెలుగు హీరోలు ఇద్దరే ఇద్దరని అది ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ మాత్రమేనని తెలిపారు.వీరిద్దరిలో ఏ ఒక్కరు ఈ సినిమాలో నటించిన సినిమా సరికొత్త రికార్డులను సృష్టించేదని ఈయన అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని తాను దర్శకుడికి చెప్పగా అప్పటికే హీరోని ఫిక్స్ చేసి ఉండడంతో ఏం చేయలేని పరిస్థితి అని ఈయన వెల్లడించారు.

 

పిల్లలని చదివించి వారికి ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న ప్రతి తల్లిదండ్రులకు ఈ సినిమా రీచ్ అవుతుందని భావించాము.ఇక సత్యదేవ్ కెరియర్ లోనే ఇది హైయెస్ట్ బడ్జెట్ సినిమాగా మిగిలిందని ఈ సినిమా వల్ల తనకు డబ్బు నష్టపోయిందని తను ఎప్పుడు బాధపడనని తెలిపారు. సినిమాల వల్ల వచ్చిన డబ్బు సినిమానే తీసుకుపోయిందని భావిస్తాను అంటూ ఈ సందర్భంగా సి కళ్యాణ్ గాడ్సే సినిమా గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -