Pawan Kalyan: పవర్స్టార్ పవన్ కల్యాణ్ బైక్ డ్రైవింగ్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్నాయి. ప్రస్తుతం పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ గ్యాప్లో సరదాగా బైక్ నడుపుతూ పవన్ సందడి చేశారు. ఖరీదైన బీఎండబ్ల్యూకి చెందిన బీఎండబ్ల్యూ 1250 జీఎస్ మోడల్ బైక్పై పవన్ రైడ్ చేశారు. బైక్ రైడింగ్ చేస్తున్న సమయంలో షూటింగ్కి సంబంధించిన కాస్టూమ్స్లో పవన్ కనిపించారు.
ఆ బైక్ ఖరీదెంతో తెలుసా..?
పవన్ బైక్ రైడ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఆ బైక్ ఖరీదు గురించి చర్చ జరుగుతోంది. ఈ బైక్ ధర రూ.24 లక్షలుగా చెబుతున్నారు. హైదరాబాద్లో ఆ బైక్ ఆన్ రోడ్ ప్రైజ్ ధర రూ.24 లక్షలుగా ఉంది. ఇంత ఖరీదైన బైక్ను పవన్ డ్రైవ్ చేస్తూ షూటింగ్లో ఎంజాయ్ చేశారు. షూటింగ్లోని సిబ్బంది పవన్ డ్రైవ్ చేస్తున్న సమయంలో ఫొటోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో.. అవి కాస్త వైరల్గా మారినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా సాగుతోంది. దాదాపు 900 మంది నటీనటులు తాజాగా ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. వీలైనంత త్వరగా షూటింగ్ను పూర్తి చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తోన్నారు.
ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. కానీ ఏపీలో పొలిటికల్గా పవన్ బిజీగా ఉండటం, రాజకీయ పర్యటన వల్ల సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అయింది. ఇటీవల మళ్లీ పవన్ వరుసగా షూటింగ్లలో పాల్గొంటున్నారు. చారిత్రాత్మక కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై పవన్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.