ఈ క్రమంలో తాజాగా ఒక మీడియా సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీ నాయకులలో మంటలు రేపాయి. ఈ మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..” గతంలో ప్రజలకు సేవ చేయటానికి రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయ నాయకులు పాటుపడే వారిని, కానీ ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు అన్ని కూడా కుట్రలు కుతంత్రాలతో ఉన్నాయని తెలిపాడు.
అంతే కాకుండా అభిమానం ఉన్నంత మాత్రాన అధికారం రాదని ఓట్లు వేస్తేనే సీఎం పదవి దక్కుతుందని తప్పుకొచ్చాడు. ఎన్టీ రామారావు గారు అభిమానం వల్ల అధికారంలోకి వచ్చాడేమో కానీ నా విషయంలో మాత్రం అభిమానం ఉంటే సరిపోదు ఓట్లు వేస్తేనే అధికారంలోకి రాగలను అని తెలిపాడు. అలాగే రాజకీయాలలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి నిర్మాణాత్మకమైన రాజకీయం, మరొకటి కక్ష్యపూరిత రాజకీయం.
నేనెప్పుడూ ఒక్కో ఇటుక పేరుస్తు నిర్మించుకుంటాను అని తెలిపాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పాటు పడుతున్న తనని కొందరు శత్రువులుగా భావిస్తున్నారని, అలా శత్రువుగా ఉండటం తనకి ఇష్టమేనని తెలిపాడు. నన్ను భయపెట్టటానికి ఎన్ని మాటలు అన్నా కూడా నేను అంతకంతకు రాటు తేలుతాను.. నన్ను మెత్తగా ఉంచుతారా లేక మా తెనాలి వెంకటేశ్వర రావు దగ్గర నుండి చెప్పులు తెచ్చి చుపించేలా చేస్తారో మీ చేతుల్లో ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.