Akira Nandan: అకీరా నందన్ ఫస్ట్ మూవీ ప్రకటన అప్పుడేనా.. పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునే న్యూస్ అంటూ?

Akira Nandan: అకీరా నందన్ పరిచయం అవసరం లేని పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడిగా అందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి ఈయన ప్రస్తుతం తన తల్లి వద్ద పెరుగుతూ చదువుల నిమిత్తం విదేశాలలో చదువుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ దంపతులకు జన్మించిన కుమారుడే అకీరా నందన్. ఇక పవన్ కళ్యాణ్ వారసుడిగా అకిరా ఇండస్ట్రీ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని అభిమానులు అందరూ కూడా ఎదురుచూస్తున్నారు.

ఇలా ఈయన ఎంట్రీ కోసం ఎదురుచూసే అభిమానులకు ఇది నిజంగానే ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి త్వరలోనే అకిరా నందన్ ఎంట్రీ ఉండబోతుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే ఈయన విదేశాలలో ఫిల్మ్ ఇండస్ట్రీలో శిక్షణ తీసుకుంటున్నట్లు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసి డిలీట్ చేశారు అయితే ఈ పోస్ట్ పై రేణు దేశాయ్ సినిమాలు అంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పేశారు.

అకిరా నందన్ మాత్రం విదేశాలలో ప్రస్తుతం ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లోనే శిక్షణ తీసుకుంటున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈయన పవన్ కళ్యాణ్ వారసుడిగా ఇండస్ట్రీలోకి రాబోతున్నారు అంటే కూడా తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. డైరెక్టర్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ ని కలిసి అకిరా కోసం అద్భుతమైన కథ చెప్పారని తెలుస్తోంది . ఈ కథ విన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా హ్యాపీగానే ఫీలయ్యారని సమాచారం.

ఇక అకిరా నందన్ 2024వ సంవత్సరంలో తన మొదటి సినిమాకి సంబంధించినటువంటి అన్ని వివరాలను అధికారకంగా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి డైరెక్టర్ ఈయనని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని ఈ సినిమా కూడా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి అఖీరాకు ఇప్పటికే విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక ఈయన సినిమాలలోకి వస్తే తండ్రికి మించిన తనయుడు అనిపించుకోవడంలో ఏమాత్రం సందేహం లేదని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -