Pawan Kalyan: జగన్ కు షాకిచ్చేలా పవన్ ప్లాన్.. టీడీపీతో కలిసి అలా చేస్తారా?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాజకీయాలు మొదలయ్యాయి.వచ్చే ఎన్నికలలో ఎలాగైనా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ప్రతిపక్ష పార్టీలో పెద్ద ఎత్తున ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక అధికార ప్రభుత్వం మాత్రం వచ్చే ఎన్నికలలో అన్ని నియోజకవర్గాలలో తమ పార్టీ జెండా ఎగరవేస్తామంటూ శవతాలు చేస్తున్నారు.

ఇలా ఎవరికివారు వచ్చే ఎన్నికలలో గెలుపొందుతామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఎలాగైనా తన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలి అంటూ పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. అయితే ఒంటరిగా పోరాటం చేస్తే జగన్ ప్రభుత్వాన్ని ఎదిరించలేమని భావించిన చంద్రబాబు నాయుడు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోని ఈయన జనసేన పార్టీతో పొత్తుకు సిద్ధమయ్యారని చెప్పాలి.

 

ఇక పవన్ కళ్యాణ్ కూడా వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలుపొందాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గెలుస్తానని చెబుతున్నప్పటికీ అధికారపక్ష నేతలు మాత్రం ఈయనపై తీవ్రస్థాయిలో కామెంట్లు చేస్తూ ముందు వార్డ్ మెంబర్ గా గెలవనివ్వండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.అయితే పవన్ కళ్యాణ్ మాత్రం వచ్చే ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది.

 

గత ఎన్నికలలో వైఎస్ఆర్సిపి పార్టీ 151 సీట్లను గెలుచుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికలలో మాత్రం 152 సీట్లను గెలుపొంది తన పవర్ ఏంటో చూపిస్తానని పవన్ కళ్యాణ్ శపథాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో ఈయన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని జగన్ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చే ప్రణాళికలు వేస్తున్నారని తెలుస్తుంది. ఎవరైతే తనని చులకనగా భావించారో అలాంటి వారికి తన గెలుపుతోనే బుద్ధి చెప్పాలని పవన్ తన సన్నిహితుల దగ్గర వెల్లడించినట్టు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -