Balayya: హిందూపురంలో బాలయ్యను ఓడించాలని పెద్దిరెడ్డి ప్లాన్….!

Balayya: నందమూరి బాలకృష్ణ నందమూరి తారక రామారావు వారసుడిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడుగా ఉంటూ హిందూపురం నుండి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. 2014లో హిందూపురం నుండి మొదటిసారి గెలిచిన బాలకృష్ణ తిరిగి 2019 ఎన్నికల్లో కూడా హిందూపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై అక్కడ ప్రజలకు సేవ చేస్తూ వస్తున్నారు.

 

హిందూపురం టీడీపీకి కంచుకోట అనే సంగతి తెలిసిందే. అక్కడ టీడీపీ నుంచి ఎవరు పోటీ చేసినా తిరుగుండదు. బాలయ్య మరోమారు హిందూపురం నుంచి పోటీ చేయనున్నారు. హిందూపురం ప్రజలకు మేలు చేసేలా ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల హిందూపురం ఓటర్లు బాలయ్యను మళ్లీ గెలిపించాలని భావిస్తున్నారు. అయితే బాలయ్య టార్గెట్ గా మంత్రి పెద్దిరెడ్డి హిందూపురంలోని మండలాల్లో ఆరు రోజుల క్యాంప్ వేస్తున్నారని భోగట్టా. అయితే ఈ విషయం తెలిసిన టీడీపీ ఫ్యాన్స్ హిందూపురంలో బాలయ్యను ఓడించడం ఎవరి తరం కాదుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

2019లో రాష్ట్రం మొత్తం వైసిపి గాలివీచిన కూడా హిందూపురం మాత్రం టీడీపీకి అనుకూలంగా ఉంది.
దీన్ని బట్టి చూస్తే చెప్పచ్చు హిందూపురంలో టిడిపిని గాని బాలయ్యను గాని ఓడించడం కాదు అని. పైగా ఇప్పుడు వైసీపీ పైన ప్రజలు తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. ఈ ఎన్నికల్లో వైసీపీ గట్టెక్కడం కష్టం అనే మాట చెబుతున్నారు. బాలకృష్ణ సినిమాల్లో బిజీగా ఉన్నా కూడా హిందూపురంలో ప్రజలకు జరగాల్సిన మంచి చెడ్డలన్నీ కూడా స్వయంగా పర్యవేక్షిస్తూ ఉంటారు. హిందూపురం ప్రజలకు ఏం కావాలన్నా బాలయ్య చేసి పెడతారని మాట కూడా ఆ ప్రజల నుండి వినిపిస్తుంది.

 

అటువంటి అతనిని ఆ ప్రజలు ఓడించుకోవడం అనేది అసాధ్యం. అయితే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి టిడిపికి కంచు కోటగా ఉన్న నియోజకవర్గాలపై టార్గెట్ పెట్టినట్లుగా కనిపిస్తుంది. అందులో భాగంగానే హిందూపురంలో బాలయ్యను ఓడించడానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రంగంలోకి దింపారు. అయితే మంత్రి పెద్దిరెడ్డి అక్కడ జనాలను పోగేసి అలజడి సృష్టించాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది. అవసరమైతే కోట్లకు కోట్లు డబ్బు ఖర్చు పెట్టి అయినా సరే వైసీపీ ఖాతాలోకి నియోజకవర్గాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. రాష్ట్ర మొత్తం వ్యతిరేకిస్తున్న వైసీపీ పాలన హిందూపురం ప్రజలు ఎందుకు కోరుకుంటారో వైసీపీ నాయకులకే తెలియాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -