Penamaluru MLA: 2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడితే కొద్దీ ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ మీద షాక్ తగులుతుంది. ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ బయటకు వచ్చి తమ నిరసన తెలియజేస్తున్నారు. ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థుల మార్పు పైన కసరత్తులు చేపట్టారు. చాలామంది అభ్యర్థులను మార్చి కొత్తవారికి ఇన్చార్జులుగా బాధ్యతలు ప్రకటిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమని సంప్రదించకుండా అభ్యర్థులను మార్చడం ఏ మేరకు సమంజసం అంటూ చెప్పుకొస్తున్నారు. చాలామంది బహిరంగంగానే ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడం గమనార్హం. వీరిలో అందరికంటే ముందుగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ చస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినంటు చెప్పారు. పలుచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయితే జగన్ సీటు ఇచ్చిన ఇవ్వకపోయినా ఇండిపెండెంట్గా అయినా నిలబడతామంటూ బహిర్గతంగా చెబుతున్నారు.
ఇప్పుడు కృష్ణాజిల్లా పెనమలూరు ఎమ్మెల్యే వంతు వచ్చింది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నది సీనియర్ నాయకుడు కొలుసు పార్థసారథి. ఈయన కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే మొన్న జరిగిన మీటింగ్ లో కలిసి పార్థసారథి ప్రజలందరి ముందు జగన్మోహన్ రెడ్డికి నేను కనబడడం లేదని, మా నాయకుడు నన్ను గుర్తించడం లేదంటూ తన బాధలు చెప్పారు. ఇదంతా పెనమలూరు ఎమ్మెల్యే అభ్యర్థి సీటు మార్చడం వల్లే పార్థసారథి మనస్థాపం చెంది ఇలా మాట్లాడారని ఆయన అనుచరులు అంటున్నారు. ఇప్పుడు పెనమలూరు సీటు మార్చడం ఖాయం కావడంతో పార్థసారథి టిడిపి వైపు చూస్తున్నారట.
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో రహస్యంగా భేటీ అయినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ కండువా కప్పుకోవడం గ్యారెంటీ అని అంటున్నారు. పార్థసారథి టిడిపిలో చేరితే పెనమలూరులో వైసీపీకి ఎదురు దెబ్బ తగలడం ఖాయం. ఇలా అసంతృప్తి ఎమ్మెల్యేలందరూ వేరే పార్టీలు చూసుకోవడంతో జగన్మోహన్ రెడ్డికి ఏం చేయాలో పాలిపోవడం లేదట. ఎమ్మెల్యే సిటీ ఇవ్వకపోయినా మద్దతుగా ఉంటారు అనుకున్నా నాయకులందరూ ఇలా జంప్ అయిపోవడంతో వ్యతిరేకత మూటగట్టుకోవాల్సి వస్తుందని ఆలోచనలో పడినట్లు వినికిడి.