Aamani: హీరోయిన్ ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మెరిసింది. అప్పటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఆమని ఎక్కువగా.. రాజేంద్ర ప్రసాద్, బాలకృష్ణ, జగపతి బాబు వంటి స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించారు. ఆమని నటించిన ఎన్నో సినిమాలు మంచి హిట్ను అందుకున్నాయి. ఇప్పటికీ ఆ సినిమాలను చూసినా కొంచెం కూడా బోర్ కొట్టదు. అయితే సినీ ఇండస్ట్రీకి దూరమైన ఆమల తిరిగి.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. అలాగే అప్పుడప్పుడు జబర్దస్త్ షోకి జడ్జిగా, ఆయా షోలకు సెలబ్రిటీగా వెళ్తున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమని.. తనకు సంబంధించిన విషాద గాధను చెప్పుకొచ్చింది. గతంలో ఆమెను కొందరు వ్యక్తులు మోసం చేశారని, కోట్లల్లో డబ్బులు తీసుకుని ముంచేశారని ఆమెనే స్వయంగా చెప్పుకొచ్చింది. వారి చేతిలో మోసపోవడం వల్లే ఇప్పుడు ఇలా ఉంటున్నానని ఆమె ఎమోషనలై మాట్లాడింది. ఆమని.. హీరోయిన్గా ఉన్నప్పుడు వందకుపైగా సినిమాలు చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీతోపాటు తమిళ, మలయాళ సినిమాల్లో నటించారు. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఆమనికి డబ్బులు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియదు. దీంతో కొందరు మేనేజర్లకు డబ్బులు నమ్మి ఇచ్చింది. గుడ్డిగా నమ్మి కోట్ల రూపాయలు కోల్పోయినట్లు, నమ్మిన వారి చేతిలో మోసపోయినట్లు ఆమె చెప్పుకొచ్చింది.
అలా కోట్లు పోగొట్టుకున్న ఆమనికి కొంత మేరా ఆస్తులు మిగిలాయని చెప్పుకొచ్చింది. తన తమ్ముడు చిన్నా వాడు కావడంతో అతడిని కొంచెం డబ్బులు ఇచ్చేసినట్లు చెప్పింది. ఆ తర్వాత తనను అర్థం చేసుకునే వ్యక్తి లైఫ్లోకి రావడంతో.. అతడిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. అయితే ప్రస్తుతం కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశానని ఆమని చెప్పారు. డబ్బులు ఎంత కోల్పోయానో.. తిరిగి సంపాదించుకోవడానికి కష్టపడుతున్నట్లు పేర్కొన్నారు.