Polavaram: తాళి కట్టిన భార్యను దారుణంగా కొట్టిన భర్త.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న భార్య?

Polavaram: సమాజంలో రోజురోజుకీ వివాహేతర సంబంధాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వివాహేతర సంబంధాల వల్ల ఇప్పటికే ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయిన విషయం తెలిసిందే.. ఈ వివాహేతర సంబంధాల మోజులో పడి కట్టుకున్న భార్యను చంపడం, తాళి కట్టిన భర్తను చంపడం, లేదంటే ఆ విషయం గురించి గొడవపడి ఎవరో ఒకరు ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడం ఇలాంటి ఘటనలు సమాజంలో రోజు ఏదో ఒక ప్రదేశంలో వెలుగులోకి వస్తున్నప్పటికీ అటువంటి వారిలో మాత్రం మార్పు రావడం లేదు. నిజంగా కూడా వివాహేతర సంబంధాల వల్ల ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

 

తాజాగా ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం మండలంలోని ఎ. పోలవరం గ్రామానికి చెందిన వనపర్తి సతీష్ తో అదే గ్రామానికి చెందిన దేవి అనే 21 ఏళ్ళ యువతితో ఏడాది క్రితం పెళ్లి అయ్యింది. కాగా ప్రస్తుతం ఈ దంపతులకు ఏడు నెలల పాప కూడా ఉంది. అయితే పెళ్లైన కొన్ని నెలల పాటు దేవితో సతీష్ ఎంతో ప్రేమగా ఉండేవాడు. కానీ రాను రాను సతీష్ చూపు పక్కదారి పట్టింది. దీంతో సతీష్ స్థానికంగా ఉండే ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పరాయి మహిళ మోజులో పడ్డ సతీష్ దేవిని నిర్లక్ష్యం చేయడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. మూడు రోజుల కిందట మరోసారి వారిద్దరి మధ్య గొడవ జరిగింది.

 

అయితే కోపంలో సతీష్ దేవిని కొట్టడంతో తీవ్ర మనస్తాపం చెందిన దేవి తాజాగా విషంతో కూడిన మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అది గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ దేవి హాస్పిటల్లో మృతి చెందింది. ఇక ఆమె మృతి పట్ల బంధువులు అనుమానం వ్యక్తం చేస్తూ భర్త సతీష్ బలవంతంగా ఆమెకు ముందు పోసి హత్య చేసి ఉంటాడని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -