Poultry Farm Demolished: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. తమకు ఎదురు తిరిగిన వారిపై పెద్ద ఎత్తున దాడులు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇకపోతే తాజాగా ఆముదాలవలసలో మరోసారి వైసిపి నేతలు రెచ్చిపోయి టీడీపీ కార్యకర్తలపై దాడి చేశారు. ఆముదాలవలసలోని పార్వతీశం పేట వద్ద తెలుగుదేశం జనసేన మద్దతుదారులపై వైకాపా నేతలు దాడి చేసి ఆయన కోళ్ల ఫారం ధ్వంసం చేశారు.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆపుదాలవలస పురపాలక సంఘం పరిధిలో లక్ష్ముడు పేటకు చెందిన వైకాపా మద్దతుదారుడు పైల అప్పారావుకు చెందిన 90 సెంట్లు మెట్ట భూమిని 2019వ సంవత్సరంలో కిల్లి వెంకట ప్రసాద్ లీజుకు తీసుకున్నారు. ఈ లీజు 15 సంవత్సరాల పాటు అగ్రిమెంట్ ఉంది. అయితే ఈ స్థలంలో వెంకటప్రసాద్ కోళ్ల ఫారం నిర్మించుకున్నారు.
కేవలం ఐదు సంవత్సరాల గడువు మాత్రమే పూర్తి అయింది కానీ అప్పారావు మాత్రం ప్రసాద్ వద్దకు వచ్చి కోళ్ల ఫారం తీసేయాలని తనతో లీజుకు తీసుకున్న గడువు పూర్తి అయిందని గొడవ చేశారు కానీ ప్రసాద్ మాత్రం ఇంకా గడువు ఉందని తాను ఖాళీ చేయనని చెప్పారు. దీంతో శుక్రవారం వేకువ జామున అప్పారావు వైసీపీ కార్యకర్తలతో వచ్చి ప్రోక్లైన్ సహాయంతో కోళ్ల ఫారం మొత్తం ద్వంశం చేశారు.
ఈ విధంగా కోళ్ల ఫారం ద్వంశం కావడంతో అందులో ఉన్నటువంటి కొన్ని కోళ్లు కౌజు పిట్టలు పూర్తిగా మరణించాయి. అలాగే మూడు షెడ్లు ధ్వంసం కావడంతో తనకు సుమారు 50 లక్షల వరకు నష్టం వచ్చింది అంటూ వెంకటప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం తాను వైసిపి పార్టీలోకి చేరలేదన్న ఒక్క ఉద్దేశంతోనే తన పట్ల ఇలాంటి దాడికి పాల్పడ్డారు అంటూ ఈయన ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీస్ కేసు నమోదు చేశారు.