Prabhas: గుండె పగిలేంత బాధ ఉన్నా వాళ్లను వదలలేదుగా!

Prabhas: తెలుగు చిత్ర పరిశ్రమలో దివంగత నటుడు కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నటుడు ప్రభాస్. ఈయన తెలుగులో మాత్రమే కాకుండా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.ఇలా పాన్ ఇండియా హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో క్రేజ్ ఉన్నటువంటి ప్రభాస్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక రాజుల కుటుంబంలో జన్మించిన ప్రభాస్ మర్యాదలకు ఏమాత్రం లోటు ఉండదు.ఈయన ఏదైనా షూటింగ్ లొకేషన్లో ఉన్నారు అంటే తప్పనిసరిగా అక్కడున్న వారందరికీ స్వయంగా ఆహార పదార్థాలను తీసుకువస్తూ ఎంతో మర్యాదలు చేస్తుంటారు.

ఇక స్టార్ హీరోగా ఉన్నటువంటి ప్రభాస్ అభిమానుల పట్ల అదే ప్రేమ ఆప్యాయతలను కలిగి ఉంటారు. ఇందుకు నిదర్శనం తన పెదనాన్న మరణించిన సమయంలో అభిమానుల కోసం ప్రభాస్ ఆరాటపడిన తీరు అందరిని ఫిదా చేసింది. పెదనాన్న మరణంతో ఎంతో బాధలో ఉన్నటువంటి ఈయన అభిమానుల ఆకలి గురించి ఆలోచించారు.ఇలా అక్కడికి వచ్చిన అభిమానుల ఆకలిని దృష్టిలో పెట్టుకొని వారికి భోజనాలను ఏర్పాటు చేయించి వారి కడుపు నింపారు.

ఇలా ఒకవైపు పెదనాన్న మరణించిన బాధలో ఉన్నప్పటికీ అభిమానుల కోసం ప్రభాస్ ఆలోచించిన తీరు అభిమానులను ఫిదా చేసింది.ఇలా తనని ఎంతో అభిమానించే అభిమానులకు ఏ చిన్న కష్టం వచ్చినా ప్రభాస్ తట్టుకోలేరు. అయితే తాను చేసిన సహాయాన్ని బయటకు చెప్పుకోవడానికి ఈయనకు ఏమాత్రం ఇష్టం ఉండదు. ఇలా చేసిన సహాయం బయటకు చెప్పకుండా ఉండడం అంటే చాలా గ్రేట్ అని,ఇలాంటి హీరోలు ప్రతి ఒక్క ఇండస్ట్రీకి ఎంతో అవసరం అని అభిమానులు తమ అభిమానం నటుడు ప్రభాస్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -