Upasana-Syamala: దివంగత నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి గురించి మనందరికీ తెలిసిందే. రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణిగా అలాగే ప్రభాస్ కి పెద్దమ్మగా మనందరికి సుపరిచితమే. ఇది ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్యామల దేవి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంటర్వ్యూలో భాగంగా ప్రభాస్ గురించి అలాగే ఉపాసన గురించి పలు వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా శ్యామల దేవి మాట్లాడుతూ.. ప్రభాస్ కు మంచి అమ్మాయి దొరకాలని మేము కూడా కోరుకుంటున్నాము పెళ్లి జరిగి సంతోషంగా ఉండాలని మేము కూడా భావిస్తున్నాము అని తెలిపారు శ్యామల దేవి.
అలాగే సోషల్ మీడియాలో ప్రభాస్ పెళ్లికి సంబంధించి వస్తున్న వార్తలను అసలు నమ్మవద్దు. ఎవరితో రాసిపెట్టి ఉంటే వాళ్లతోనే ప్రభాస్ పెళ్లి జరుగుతుంది అని చెప్పుకొచ్చారు శ్యామలాదేవి. అనంతరం కృష్ణంరాజు గురించి స్పందిస్తూ కృష్ణంరాజు గారు ఇంట్లో పెసరట్లు వేసేవారు అని ఆమె తెలిపింది. తాను చిరంజీవికి బిర్యాని చేసి పంపించినట్లు ఆమె తెలిపింది. చిరంజీవి నుంచి తనకు దోసెలు వేరువేరు చట్నీలతో పంపించినట్లు ఆమె చెప్పుకొచ్చింది. అలాగే ఒక సందర్భంలో అపోలో ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఉపాసన తనని కూతురులా చూసుకుందని అంటూ ప్రశంసలు కురిపించింది.
అలాగే తనకు చరణ్ ఉపాసన అంటే చాలా ఇష్టమని శ్యామలాదేవి తెలిపింది. ఇంటర్వ్యూలో భాగంగా శ్యామలాదేవి చేసిన వాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ప్రభాస్ గురించి, పెళ్లి గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఇకపోతే హీరో ప్రభాస్ విషయానికొస్తే ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు ప్రాజెక్టులు పూర్తికాగా అవి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం మూడు పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు ప్రభాస్.