Preeti Nigam: వైరల్ అవుతున్న ప్రీతి నిగమ్ సంచలన వ్యాఖ్యలు!

Preeti Nigam: ప్రీతినిగమ్ పరిచయం అవసరం లేని పేరు. ఋతురాగాలు సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ప్రీతినిగమ్ అనంతరం వరుస బుల్లితెర కార్యక్రమాలలోనూ అలాగే వెండితెర సినిమా అవకాశాలను అందుకొని వెండితెరపై బుల్లితెరపై నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇలా నటిగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె తాజాగా చెప్పాలని ఉందనే కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తన వ్యక్తిగత జీవితం గురించి మాత్రమే కాకుండా వృత్తిపరమైన జీవితం గురించి కూడా మాట్లాడారు.. ఈ సందర్భంగా ప్రీతినిగమ్ మాట్లాడుతూ తన భర్త,సహనటుడు నగేష్ గురించి కొన్ని విషయాలు తెలియజేశారు. ఋతురాగాలు సీరియల్ టైంలో ఆయన నన్ను ఏడాది పాటు గమనిస్తూ ఉన్నారని అయితే ఈ విషయం మా ఇంట్లో వారికి చెప్పగా ముందు మా అత్తగారు నన్ను కోడలుగా అంగీకరించడానికి ఒప్పుకోలేదని తెలిపారు.

 

అనంతరం మా పెళ్లి జరిగిన తర్వాత ఆమె నన్ను కోడలిగా కాకుండా కూతురిలా చూసుకుంటున్నారని తెలియజేశారు. ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే…ఈమె బుల్లితెరపై పలు సీరియల్స్ లో ఎక్కువగా విలన్ పాత్రలలో నటించారు. ఇక ఈ విలన్ పాత్రల గురించి మాట్లాడుతూ తను ఓసారి విజయవాడ వెళ్ళినప్పుడు హోటల్ బాయ్ తన వంక అదోలా చూస్తున్నాడు ఏంటి ఇలా చూస్తున్నాడని సందేహం వచ్చింది. ఇక ఆగలేక తన దగ్గరికి వెళ్లి ఎందుకు అలా చూస్తున్నావు అని అడిగాను.

 

మీరు ఆ సీరియల్లో చేస్తున్నారు కదా మిమ్మల్ని రోజు మా అమ్మమ్మ చాలా తిడుతుంది అంటూ సమాధానం చెప్పాడు. ఓసారి వైజాగ్ ట్రైన్లో వెళ్తుండగా కొందరు మహిళలు మీరు మా వైజాగ్ రాకండి. వస్తే మిమ్మల్ని కొడతారు అంటూ నాకు జాగ్రత్తలతో కూడిన హెచ్చరికలు ఇచ్చారు.నెగిటివ్ పాత్రలలో నటించి బయట తిరగడం చాలా కష్టం అంటూ ఈ సందర్భంగా ప్రీతి నిగమ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -