Pregnant women: సాధారణంగా గర్భంతో ఉన్న మహిళలు మంచి పోషకాలతో నిండిన ఆహారాన్ని తీసుకోవాలని మన పెద్దలు డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. అందుకోసం గర్భవతులు ఎక్కువగా పండ్లను కూడా ఆహారంగా తీసుకోవడం మంచిది. అయితే మహిళలు గర్భంతో ఉన్న సమయంలో అరటిపండు బొప్పాయి వంటి వాటిని తినకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు.
అయితే ఇలా గర్భంతో ఉన్న సమయంలో మహిళల అరటి పండ్లు తినకూడదని మన పెద్దలు చెప్పటానికి ఒక బలమైన కారణం కూడా ఉంది. సాధారణంగా భోజనం చేసిన తర్వాత అందరూ ఆహారం జీర్ణం అవ్వటానికి అరటిపండ్లు తింటూ ఉంటారు. కానీ ఆయుర్వేదం ప్రకారం భోజనానికి ముందు ఉసిరికాయలను, అలాగే భోజనం అనంతరం రేగు పండ్లను తినాలి. దీని వల్ల తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. ఇలా తినటం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోదు. గ్యాస్, అజీర్ణం, ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
భోజనానికి ముందు లేదా భోజనం తరువాత లేదా భోజనం చేసే సమయంలో.. ఎప్పుడైనా సరే అరటి పండ్లను మాత్రం తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది.
ముఖ్యంగా గర్భంతో ఉన్న మహిళలు అరటిపండ్లు అస్సలు తినకూడదని ఆయుర్వేదం లో వెల్లడించారు.
భోజనం సమయంలో అరటి పండ్లను తినడం వల్ల కఫం, వికారం పెరుగుతాయి.
గర్భం దాల్చిన మొదటి మూడు నెలలు అరటిపండు తినటం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల గర్భం దాల్చిన మొదటి మూడు నెలలు అరటిపండు తినకూడదు. ఆ తర్వాత విడి సమయాలలో అరటిపండు తినటం వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని ఆయుర్వేద నిపుణులు. అరటిపండు తినటం వల్ల కడుపులో బిడ్డకు కూడా మంచి పోషణ లభిస్తుందని చెబుతున్నారు.