Punch Prasad: పంచ్ ప్రసాద్ భార్య సంచలన వ్యాఖ్యలు.. ఏం జరిగిందంటే?

Punch Prasad: జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ గురించి మనందరికీ తెలిసిందే. జబర్దస్త్ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న పంచు ప్రసాద్ గత కొన్ని నెలలుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. మధ్యలో కొద్ది రోజులు బాగా కోలుకొని ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసినప్పటికీ ఈ మధ్యకాలంలో పంచు ప్రసాద్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఎప్పటికప్పుడు చికిత్స తీసుకుంటున్నప్పటికీ పంచ్ ప్రసాద్ ఆరోగ్యం మాత్రం పూర్తిస్థాయిలో సహకరించడం లేదు. ఉన్న సమస్యలతో సతమతమవుతున్న పంచు ప్రసాద్ కు ఇటీవల కాలంలో మరిన్ని కొత్త కొత్త అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ప్రసాద్ భార్య అభిమానులకు ఊరట కలిగించే ఒక శుభవార్తను తెలిపింది. అదేమిటంటే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సి ఉండగా ఒక కిడ్నీ దొరికిందని ఈ విషయాన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలిపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొదట నేనే కిడ్నీ ఇద్దామనుకున్నాను. ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ముందు నాకు అన్ని టెస్టులు కూడా చేశారు. అన్నింటిలోనూ మ్యాచ్ అయ్యాయి. కానీ ఆయనది వయసు చిన్నది కావడంతో డాక్టర్లు వద్దన్నారు. బయట నుంచి తీసుకుందాం అని చెప్పారు. మళ్లీ భవిష్యత్తులో సమస్యలు వస్తే మీ కిడ్నీ తీసుకునేలా ప్లాన్ చేద్దాం అని చెప్పారు.

ప్రస్తుతం ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు వెళ్తున్నాము. మీ అందరికీ చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన ఆరోగ్యం కోసం ఇప్పటికీ చాలా టెస్టులు జరిగాయి. ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ గురించి ఆయన అభిమానులందరికీ తెలియజేయడం కోసం వీడియో చేశాను. మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్. ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీతో పంచుకుంటూ ఉంటాను. ఇలాంటి వీడియోలు పెడుతున్నందుకు ఏం అనుకోవద్దు. ఇది కేవలం మా ఛానెల్‌ ఆదరిస్తున్న వారందరికీ తెలియజేయడం కోసమే. మీ అందరీ ఆశీర్వాదంతోనే ఆయన కోలుకుంటున్నారని భావిస్తున్నాను అని చెప్పుకొచ్చింది పంచ్ ప్రసాద్ భార్య. ప్రసాద్ భార్య కూడా మనందరికీ సుపరిచితమే. ఇప్పటికే చాలాసార్లు ఆమె బుల్లితెరపై పలు ఈవెంట్లకు హాజరైన విషయం తెలిసిందే. దాంతోపాటు యూట్యూబ్ ఛానల్ ని కొత్తగా మొదలుపెట్టి ఎప్పటికప్పుడు అభిమానులకు మరింత చేరువగా ఉంటోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -