PunchPrasad: పంచ్ ప్రసాద్ ఆరోగ్యంపై డాక్టర్లు ఏమన్నారో తెలుసా? ఇప్పుడు ఎలా ఉన్నాడంటే?

PunchPrasad: ఎంతో మంది కళాకారులను ప్రపంచానికి పరిచయం చేసింది జబర్దస్త్. వారిలో చాలా మంది ఆర్టిస్టులు తమ ప్రతిభను నిరూపించుకుని సొంత అభిమానులను సంపాదించుకున్నారు. అలా తనదైన శైలి పంచులతో, ప్రాసలతో, కామెడీ టైమింగ్ తో ఎంతో మంది అభిమానులకు తెలుగు టీవీ ప్రేక్షకులకు దగ్గరయ్యారు “పంచ్ ప్రసాద్”. అయితే ఈ మధ్య పంచ్ ప్రసాద్ జబర్డస్త్ వేదికపై కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల ప్రసాద్ ఆరోగ్యం బాగా విషమించిందని.. కనీసం నడవలేని స్థితిలోకి చేరుకున్నాడని.. తోటి జబర్దస్త్ ఆర్టిస్ట్ నూకరాజు తెలియజేసాడు. దానితో ప్రసాద్ అభిమానుల్లో, జబర్దస్త్ ప్రేక్షకుల్లో కలకలం మొదలైంది. ఇక ఇటీవల ప్రసాద్ ఆరోగ్యంపై వారి భార్య మరియు డాక్టర్లు ప్రకటన చేయడంతో ప్రసాద్ కు కావాల్సిన చికిత్స అందుతున్నట్టు తెలిసింది. ప్రసాద్ కు భార్యే దగ్గరుండి సకల సేవలు చేస్తుందట.

డయాలిసిస్, ఇతర చికిత్సలు..
ప్రసాద్ కిడ్నీ సమస్యలు ఎదుర్కుంటుండటంతో డాక్టర్లు డయాలిసిస్ మరియు అవసరమైన ఇతర చికిత్సలు అందిస్తున్నారట. దీనితో ప్రస్తుతం ప్రసాద్ ఆరోగ్యం కొంత వరకు మెరుగుపడిందని.. ఐనప్పటికీ ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు డాక్టర్లు. ప్రత్యేక కేర్ తీసుకుంటూ ప్రసాద్ భార్య సపర్యలు చేస్తుంది. ఇలాగే మరికొన్ని రోజులు చికిత్స కొనసాగిస్తే.. తొందరలోనే ప్రసాద్ మళ్ళీ పూర్తి స్థాయి ఆరోగ్యవంతునిగా మన ముందుకు వస్తాడు.

ఇక ఈ విషయం బయటికి తెలియడంతో ప్రసాద్ అభిమానులు, జబర్డస్త్ ప్రేక్షకులు సంతోష పడుతున్నారు. ప్రసాద్ తొందరగా కోలుకోవాలని, మళ్ళీ మనల్ని నవ్వించాలని ఆశిస్తున్నట్టు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు జనాలు. డాక్టర్లు కూడా ప్రమాదం లేదని తెలుపడం, ప్రసాద్ ఆరోగ్యం ఇంతకు ముందుకంటే మెరుగుపడడం తో త్వరలోనే ప్రసాద్ కోలుకుంటాడని ఆశిస్తున్నారు అభిమానులు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -