Puri Jagannadh: ఆ సినిమాను సీక్వెల్ గా చేయడానికి సిద్ధమైన పూరి!

Puri Jagannadh: టాలీవుడ్ ప్రేక్షకులకు దర్శకుడు పూరీ జగన్నాథ్ పేరు కొత్తగా పరిచయం అక్కర్లేదు. బద్రి సినిమా ద్వారా దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు పూరీ. ఆ తర్వాత పోకిరి సినిమాతో డైరెక్టర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పలు వరుస సినిమాలతో పూరీ అగ్రస్థాయి డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగాడు.

మొత్తానికి పూరీ జగన్నాథ్ టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఓ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక రామ్ పోతినేని హీరోగా నటించిన.. ఇస్మార్ట్ శంకర్ మూవీని పూరీ ప్రేక్షకులకు ఏ విధంగా చూపించాడో అందరికీ తెలిసిందే. నిజంగా ఈ సినిమాతో పూరి జగన్నాథ్ టాలీవుడ్ ఇండస్ట్రీని మరోసారి ఒక రేంజ్ లో ఊపేసాడు. ఆ సినిమాలో రామ్ తెలంగాణ స్లాంగ్ లో తెలుగు ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాడు.

ఇక రామ్ యాటిట్యూడ్ కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. ఎంతైనా సినిమా ఇంత గొప్పగా తీయడం లో డైరెక్టర్ గొప్పతనం చాలా ఉంటుందని చెప్పవచ్చు. అనంతరం పూరీ లైగర్ సినిమాను విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా స్థాయిలో పరిచయం చేశాడు. కానీ ఈ సినిమా పూర్తిగా పరాజయం పాలయ్యింది. అంతేకాకుండా ఈ సినిమా కారణంగా నెటిజన్స్ బాగా ట్రోల్స్ చేశారు.

ఇదిలా ఉంటే తాజాగా పూరీ జగన్నాథ్ కు సంబంధించి ఒక అప్ డేట్ బయటకు వచ్చింది. అదేమిటంటే.. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ ను పూరి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా సీక్వెల్ గురించి పూరి ఇప్పటికే లోతుగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా సీక్వెల్ కు సంబంధించిన లైన్ కూడా సెట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన పూరి అభిమానులు.. మొదటి పార్ట్ కంటే ఊహించని స్థాయిలో ఉంటుందని అంచనాలు వేసుకుంటున్నారు. మరి ఈ సీక్వెల్ తో పూరీ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తాడో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -